-
GST On X: ట్విటర్ నుంచి డబ్బులు వస్తున్నాయా? జీఎస్టీ తప్పదు!
న్యూఢిల్లీ: ప్రకటనల ఆదాయంలో వాటాల కింద సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఎక్స్ (గతంలో ట్విటర్) నుంచి వ్యక్తులకు వచ్చే ఆదాయం కూడా జీఎస్టీ పరిధిలోకి వస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి కంటెంట్ క్రియేషన్ను సర్వీసు కింద పరిగణిస్తారు, దాని ద్వారా వచ్చే ఆదాయంపై 18 శాతం ట్యాక్స్ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఒక సంవత్సరంలో అద్దె ఆదాయం, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ, ఇతరత్రా ప్రొఫెషనల్ సర్వీసులు వంటి వివిధ సర్వీసుల నుంచి వచ్చే మొత్తం ఆదాయం రూ. 20 లక్షలు దాటిన పక్షంలో ఈ నిబంధన అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఎక్స్ ఇటీవల ప్రకటనలపై తనకు వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ప్రీమియం సబ్స్క్రైబర్స్కి కూడా అందించడం ప్రారంభించింది. ఇందుకోసం సదరు సబ్స్క్రయిబర్స్ పోస్టులకు గత మూడు నెలల్లో 1.5 కోట్ల ఇంప్రెషన్లు, కనీసం 500 మంది ఫాలోయర్లు ఉండాలి. ఎక్స్ నుంచి తమకు ఆదాయం వచ్చినట్లు పలువురు సోషల్ మీడియా యూజర్లు ఈమధ్య పోస్ట్ చేశారు. -
భారత్ గౌరవ్ రైలు మూడో సర్క్యూట్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు రైల్వే శాఖ ప్రారంభించిన భారత్ గౌరవ్ పర్యాటక రైలు మరో కొత్త సర్క్యూట్తో ముందుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వేకు ఇటీవలే ఇలాంటి రైలును కేటాయించి రెండు సర్క్యూట్ యాత్రలు ప్రారంభించిన ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తాజాగా ‘జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర’ సదరన్ సర్క్యూట్ను శనివారం ప్రకటించింది. ఇది తమిళనాడు, కేరళల్లోని ప్రధాన పర్యాటక ప్రాంతాల సందర్శనకు అవకాశం కల్పించనుంది. ఏడు ప్రాంతాలు.. తొమ్మిది రోజులు.. ఈ కొత్త సర్క్యూట్లో మొత్తం ఏడు పర్యాటక ప్రాంతాలను చేర్చారు. అరుణాచలం, కన్యాకుమారి, మదురై, రామేశ్వరం, తంజావూరు, తిరుచిరాపల్లి (తిరుచ్చి), త్రివేండ్రమ్ ప్రాంతాలను ఈ టూర్లో చుట్టేయచ్చు. ఆయా ప్రాంతాల్లోని నిర్ధారిత పర్యాటక ప్రాంతాలను చూపుతారు. ఈ అన్ని ప్రాంతాలను చుట్టి వచ్చేందుకు తొమ్మిది (ఎనిమిది రాత్రులు) రోజుల సమయం పట్టనుంది. రైలు మార్గం ఉన్న ప్రాంతాలకు రైలు ద్వారా, మిగతా ప్రాంతాలకు రోడ్డు మార్గం ద్వారా పర్యాటకులను తీసుకెళ్తారు. ఇందుకు అవసరమయ్యే బస, టీ, అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనం, వసతిని పూర్తిగా ఐఆర్సీటీసీనే కల్పిస్తుంది. ఖర్చులన్నీ ప్యాకేజీ చార్జీలోనే సర్దుబాటు చేస్తారు. ప్రయాణికులకు పూర్తి భద్రత కల్పిస్తామని, రైలులో నిరంతర పర్యవేక్షణకు సీసీటీవీలను ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. పబ్లిక్ అనౌన్స్మెంట్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని, ప్రయాణ బీమా ఉంటుందని పేర్కొన్నారు. చార్జీలు ఇలా ఎకానమీ (నాన్ ఏసీ)– పెద్దలకు రూ. 14,300, 5–11 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు రూ.13,300 స్టాండర్డ్ క్లాస్ (ఏసీ)– పెద్దలకు రూ. 21,900, పిల్లలకు రూ.20,800 కంఫర్ట్ క్లాస్ (సెకండ్ ఏసీ)– పెద్దలకు రూ.28,500, పిల్లలకు రూ.27,100 ఎకానమీ టికెట్ ఉన్న వారికి బస కోసం హోటళ్లలో నాన్ ఏసీ గది కేటాయిస్తారు. స్టాండర్డ్ టికెట్ వారికి ఏసీ షేరింగ్ రూమ్ ఇస్తారు. కంఫర్ట్ క్లాస్ వారికి ఏసీ వ్యక్తిగత గది కేటాయిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో పది హాల్టులుంటాయి. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికులు రైలు ఎక్కేందుకు వెసులుబాటు ఉంటుంది. సికింద్రాబాద్లో బయలుదేరే రైలు కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటలో ఆగుతుంది. ఆయా స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కిదిగొచ్చు. తొలిరోజే 300 టికెట్ల అమ్మకం.. ఈ యాత్రకు సంబంధించి మూడు ట్రిప్పుల తేదీలను ఐఆర్సీటీసీ వెల్లడించింది. ఆగస్టు 9, 23, సెప్టెంబర్ 5 తేదీలకు సంబంధించి బుకింగ్స్ ప్రారంభించింది. తొలిరోజే 300 టికెట్లు అమ్ముడైనట్టు తెలిసింది. -
రూ. 1.30 కోట్ల ప్యాకేజీ, నెలకు 20 రోజులు సెలవు - ఇది కదా ఉద్యోగమంటే..!!
Australia Job Ad: ఏ దేశంలో అయినా డాక్టర్లకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే కరోనా మహమ్మారి విజృంభణ తరువాత ఈ డిమాండ్ మరింత పెరిగింది. ఈ డిమాండ్తో పాటు వేతనాలు కూడా భారీగా పెరిగాయి. అయితే ఆస్ట్రేలియా వంటి దేశాల్లో డాక్టర్లకు అద్భుతమైన శాలరీ మాత్రమే కాకుండా, అంతకు మించిన స్పెషలిటీస్ కూడా అందిస్తున్నాయి. ఇటీవల ఒక ట్విటర్ పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రూ. కోటికి పైగా ప్యాకేజీ.. సోషల్ మీడియాలో వెల్లడైన జాబ్ యాడ్ పోస్ట్ ప్రకారం, ఏడాదికి రూ.1.30 కోట్లు జీతం అందిస్తామని, అంతే కాకుండా నెలలో కేవలం 10 రోజులు మాత్రమే పని దినాలు, మిగిలిన 20 రోజులు సెలవులు అని తెలిపింది. ఇది జాబ్ అడ్వర్టైజ్మెంట్ బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ యూనియన్ ప్రముఖ జర్నల్ BMJలో ప్రచురితమైంది. ఇంకా సైన్ ఇన్ బోనస్ కింద రూ. 2.7 లక్షలు కూడా అందుతాయని తెలుస్తోంది. ఆస్ట్రేలియన్ మెడికల్ రిక్రూట్మెంట్ సంస్థ బ్లూగిబ్బన్ ఈ యాడ్ రూపోంచినట్లు తెలుస్తోంది. ఇందులో ఆస్ట్రేలియా నేషనల్ హెల్త్ స్కీమ్తో (NHS) కలిసి పనిచేయాలని వెల్లడించింది. ఇది డాక్టర్లకు గొప్ప అవకాశం అనే చెప్పాలి. అయితే గత కొన్ని రోజుల నుంచి ఆస్ట్రేలియాలో ఆరోగ్య కార్యకర్తలు, ప్రభుత్వం మధ్య వేతనాలకు సంబంధించి వివాదం నడుస్తూనే ఉంది. (ఇదీ చదవండి: ఇండియన్ సెలబ్రిటీల మనసు దోచిన అమెరికన్ బ్రాండ్ కారు, ఇదే - చూసారా..!) How depressing to see this in the BMJ. It’s hard to say those figures don’t present a compelling argument. It all leads to a big question for the govt: if you don’t address doctors’ very reasonable pay concerns, alongside their conditions and wellbeing, guess where they’re going? pic.twitter.com/24oKKrgfLa — Adam Kay (@amateuradam) May 3, 2023 ముఖ్యంగా యూకేలోని గ్రాడ్యుయేట్ డాక్టర్లను ఆస్ట్రేలియా ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్, ఎమర్జెన్సీ, ఎక్స్పీరియన్స్ వంటివి ఉన్నవారికి ఇక్కడ ఎక్కువ అవకాశం ఉంది. మొత్తం మీద ఎక్కువ శాలరీ కావాలనుకునే డాక్టర్లు ఆస్ట్రేలియన్ అందిస్తున్న ఈ ఆఫర్ ఉపయోగించుకోవచ్చు. ఈ ఉద్యోగంలో చేరేవారికి వసతి సదుపాయం కూడా లభిస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఒక్క యాడ్తో సెలబ్రిటీగా మారింది.. ఏం జరిగిందో ఏమో భావోద్వేగ పోస్టు పెట్టి మృతి!
యునైటెడ్ ఎయిర్లైన్స్ వాణిజ్య ప్రకటనలో కనిపించి సెలబ్రిటీగా మారిన ట్రాన్స్జెండర్ ఫ్లైట్ అటెండెంట్ కైలీ స్కాట్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టి ప్రాణాలు తీసుకున్నారు. ఆమె కొలరాడోలోని తన ఇంటిలో గత సోమవారం చనిపోయింది. స్కాట్ మరణించడానికి ముందు తన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పోస్ట్లలో.. తన స్నేహితులు, కుటుంబ సభ్యులను ఉద్దేశించి భావోద్వేగ పోస్ట చేసింది. ‘మనం పంచుకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకోవాలని’ కోరింది. ‘నేను నా చివరి శ్వాసను తీసుకుంటూ, ఈ భూమి నుండి నిష్క్రమిస్తున్నాను. నేను నిరాశపరిచిన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను’ అని స్కాట్ పేర్కొంది. ‘మీతో ఉండలేకపోయాను, క్షమించండి, నేను ఇష్టపడే వారికి తోడుగా ఉండలేకపోతున్నాను, మిమ్మల్ని వదలి వెళ్ళడం లేదని దయచేసి అర్థం చేసుకోండంటూ’ తన ఆవేదనను పోస్ట్ రూపంలో రాసుకొచ్చింది. ఈ పోస్ట్లో స్కాట్ తన ప్రియమైన వారిలో కొందరి పేర్లను కూడా పేర్కొంది. స్కాట్ తల్లి, ఆండ్రియా సిల్వెస్ట్రో, లేఖను పోస్ట్ చేసిన తర్వాత తన కుమార్తె మరణించినట్లు ధృవీకరించింది. ఫేస్బుక్ పోస్ట్లో.. సిల్వెస్ట్రో ఇలా వ్రాశారు.. "కైలీ స్కాట్... నువ్వు నా కుమార్తెగా పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నీ నవ్వు చాలా అందంగా ఉండేది. నీ హృదయం మాలో ఎవరికీ అర్థం కానంత పెద్దది” అని తెలిపారు. కాగా, స్కాట్ మరణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
విశ్రాంతి గదిలో విగతజీవిగా.. ఏడీ అనుమానాస్పద మృతి
సాక్షి, అనంతపురం: పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) ఎం.రాము (50) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతపురంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోని మొదటి అంతస్తులో గల విశ్రాంతి గదిలో ఉరికి వేలాడుతుండగా సిబ్బంది మంగళవారం గమనించారు. తలుపులు తెరిచి ఉండటం అనుమానాలకు తావిస్తోంది. తన చావుకు పలువురు కారణమంటూ పేర్లు రాసి ఉన్న లేఖ లభించింది. హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పోలీసులు, కార్యాలయ సిబ్బంది తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బాపట్ల జిల్లాకు చెందిన ఎం.రాముకు భార్య రాణి (ప్రభుత్వ కళాశాల లెక్చరర్), కుమార్తె రిత్విక ఉన్నారు. భార్య, కుమార్తె కర్నూలులో స్థిరపడగా.. రాము మాత్రం పదేళ్లుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన ధర్మవరం, పుట్టపర్తి ప్రాంతాల్లో ఎక్కువ కాలం పనిచేశారు. ప్రస్తుతం డీఆర్డీఏ లైవ్స్టాక్ విభాగం డీపీఎంగా వ్యవహరిస్తున్నారు. సోమవారం సాయంత్రం క్యాంపు ముగించుకుని విశ్రాంతి గదికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం పశుసంవర్ధక శాఖ కార్యాలయ డ్రైవర్ రామసుబ్బారెడ్డి విద్యుత్ మోటార్ ఆన్ చేసేందుకని మొదటి అంతస్తులోకి వచ్చాడు. చదవండి: (ప్రేయసి ఇంటి వరండాలో శవంగా మారిన యువకుడు) అప్పటికే అక్కడ విశ్రాంతి గది తలుపులు కొంత తెరుచుకుని ఉండటంతో లోపలికి తొంగి చూశాడు. ఫ్యాన్కు ఉరికి వేలాడుతున్న ఏడీని చూసి వెంటనే ఉన్నతాధికారులతో పాటు పోలీసులకు సమాచారమందించాడు. వన్టౌన్ పోలీసులు హుటాహుటిన వచ్చి గదిని పరిశీలించగా.. సూసైడ్ నోట్ లభించింది. మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏడీ సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. చనిపోవడానికి ముందు పలువురితో సంభాషించినట్లు, గట్టిగా అరుస్తున్నట్లు శబ్దాలు వినిపించాయని సిబ్బంది పోలీసులకు తెలిపారు. స్వతహాగా ఏడీ స్థానికంగా ఎవరితోనూ కలివిడిగా ఉండేవారు కాకపోవడంతో సూసైడ్ నోట్లో పేర్కొన్న వ్యక్తులు, వారి వ్యవహారాల గురించి తెలియదని పేర్కొన్నారు. డ్రైవర్ రామసుబ్బారెడ్డిని ప్రాథమికంగా విచారణ చేశారు. ఏడీ గదికి ఎవరెవరు వచ్చారో.. ఆయన ఏ సమయంలో చనిపోయారో తెలియదని సిబ్బంది తెలిపారు. అయితే తలుపులు తెరిచి ఉండడం అనుమానాలకు తావిస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ రవిశంకర్రెడ్డి తెలిపారు. హత్యా.. ఆత్మహత్యా.. మృతికి గల కారణాలు దర్యాప్తులో తేలుస్తామన్నారు. చదవండి: (ఏడాది క్రితం పెళ్లి.. జోగ్ ఫాల్స్ చూడాలని వెళ్లి..) ఏడీ సూసైడ్ నోట్లో ఏముందంటే... ‘నా చావుకు కారణం అటెండర్ జాకీర్, కోట్ల విజయ, కోట్ల అనిల్, కోట్ల విజయ లవర్ మహేష్. వీరు రూ.50 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసినారు. చిక్కబళ్లాపురకు చెందిన నెట్ సెర్ఫ్ వ్యాపార భాగస్వామి మునిరాం, పుట్టపర్తికి చెందిన జియోన్ మెడికల్ షాపు ఓనర్ అశోక్కుమార్, ధర్మవరానికి చెందిన మెడికల్ స్టోర్ అశ్వర్థనారాయణ, హరికృష్ణ కల్లూరు స్టాక్ తీసుకుపోయి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారు. సెమన్ బ్యాంకులో పని చేసే డీసీ హుసేన్, అశోక్కుమార్లకు నా పేరు మీద ప్రాంసరీ నోటు రాయించి రూ.4లక్షలు ఇప్పించాను. నన్ను మోసం చేసినారు. ధర్మవరంలో 27.50 ఎకరాల భూమి పత్రాలు 925–2022 చెన్నేకొత్తపల్లి’ అంటూ అస్పష్టంగా వివరాలు రాశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement