జననేతకు వాడవాడలా మద్దతు | Sakshi
Sakshi News home page

జననేతకు వాడవాడలా మద్దతు

Published Thu, Oct 8 2015 12:44 PM

జననేతకు వాడవాడలా మద్దతు - Sakshi

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష గురువారం రెండో రోజుకు చేరుకుంది. వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు.  

అనంతపురం జిల్లా :
అనంతపురంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుర్నాధరెడ్డి ఆధ్వరంలో నిరాహార దీక్ష చేపట్టారు.
ఎస్కే యూనివర్శిటీలో విద్యార్థి సంఘాల ఆందోళన.
వజ్రకరూరు, కూడేరు మండల కేంద్రాల్లో వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు రిలే నిరాహారదీక్షలు.
రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నిరాహారదీక్ష.
మడకశిర, గుడిబండ, అగళి మండల కేంద్రాల్లో వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు.
తాడిపత్రి వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త రమేశ్రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా.

కడప జిల్లా :
ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట్ట కోదండరామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన పెన్నా సిమెంట్ అధినేత వేణుగోపాల్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు
ఆకేపాటి అమర్నాధ్రెడ్డి.
జమ్మలమడుగులో వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు రిలే నిరాహారదీక్షలు.
రాజంపేటలో వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాధ్రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల రిలే నిరాహారదీక్షలు.
రైల్వే కోడూరు గాంధీ విగ్రహం వద్ద పార్టీ నేత కె.బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష.

కర్నూలు జిల్లా :
కర్నూలు నగరంలో స్థానిక ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్లో నిరాహారదీక్ష
చేపట్టారు.
కల్లూరు మండలం మాధవీనగర్లో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి రిలే నిరాహారదీక్ష.
కర్నూలు నగరంలోని డీమాస్ సర్కిల్లో వైఎస్ఆర్ సీపీ నేత సాయిప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల రిలే నిరాహార దీక్షలు.
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ప్రత్యేక హోదా కోసం మండల వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, నాయకులు రిలే నిరాహారదీక్షలు
వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా ఎమ్మిగనూరులో వైఎస్ఆర్ సీపీ నేత ఎర్రకోట జగన్మోహన్రెడ్డి రిలే నిరాహారదీక్ష

చిత్తూరు జిల్లా :
తిరుపతిలో స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట భూమన కరుణాకర్రెడ్డి నేతృత్వంలో దీక్షలు చేపట్టారు.
స్థానిక ఎస్వీయూలో విద్యార్థి సంఘాల దీక్షలు.
పుత్తూరులో మాజీ ఎంపీపీ ఏలుమలై ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ.

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా :
వేదాయపాలెం సెంటర్లో వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తల మానవహారం. ఎంపీలు మేకపాటి, వరప్రసాదరావు, జెడ్పీ ఛైర్మన్
రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్యేలు సంజీవయ్య, రాంరెడ్డి ప్రతాప్కుమార్ రెడ్డి.
పొదలకూరులో వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు, భారీగా హాజరైన కార్యకర్తలు
నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్లో వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రావణ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థుల రిలే దీక్షలు.
నెల్లూరు నగరంలో ఎమ్మెల్యే అనిల్కుమార్యాదవ్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు.

ప్రకాశం జిల్లా :
పరుచూరులో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల రిలే నిరాహార దీక్ష.
గిద్దలూరులో జిల్లా అధ్యక్షుడు అశోక్రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు

పశ్చిమగోదావరి జిల్లా:
పశ్చిమగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో నరసాపురంలో కార్యకర్తల రిలే
నిరాహారదీక్ష.
జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్ సీపీ నేతలు రిలే నిరాహారదీక్షలు.
తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ తోట గోపి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష.

తూర్పు గోదావరి జిల్లా :
జిల్లా వ్యాప్తంగా వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు.
ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నేతృత్వంలో రాజమండ్రి కోటగుమ్మం వద్ద కార్యకర్తల రిలే దీక్షలు.
ముమ్మిడివరంలో పార్టీ నేత గుత్తుల సాయి ఆధ్వర్యంలో కార్యకర్తలు రిలే దీక్షలు.
రంపచోడవరంలో నేత బాలకృష్ణ ఆధ్వర్యంలో కార్యకర్తల రిలే దీక్షలు.
రావులపాలెంలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల రిలే దీక్షలు.
పి.గన్నవరంలో వైఎస్ఆర్ సీపీ నేత కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో కార్యకర్తల రిలే దీక్షలు.
అమలాపురంలో వైఎస్ఆర్ సీపీ నేతలు విశ్వరూప్, కుడిపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో కార్యకర్తలు రిలే దీక్షలు.
పిఠాపురంలో పిండెం దొరబాబు ఆధ్వర్యంలో కార్యకర్తల రిలే నిరాహారదీక్షలు.
రాజమండ్రి రూరల్లో గిరిజాల వెంకటస్వామినాయుడు ఆధ్వర్యంలో రిలే దీక్షలు
మండపేటలో వేగుళ్ల లీలాకృష్ణ, పట్టాభిరామయ్య ఆధ్వర్యంలో రిలే దీక్షలు
అనపర్తిలో డా.సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు
జగ్గంపేటలో రిలేదీక్షలు ప్రారంభించిన వైఎస్ఆర్ సీపీ నేత జ్యోతుల నవీన్

విశాఖపట్నం జిల్లా :
మునగపాకలో వైఎస్ఆర్ సీపీ అరకు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు.
పాడేరులో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
పాయకరావుపేటలో నియోజకవర్గ ఇంఛార్జ్ చెంగల వెంకట్రావ్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
తగరపువలసలో ఎ. వెంకట్రావ్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
ఎలమంచిలిలో నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు రిలే దీక్షలు.
చోడవరంలో కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
జి. మాడుగులలో ఎమ్మెల్యే బి. ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
నర్సిపట్నంలో నియోజకవర్గ ఇంఛార్జ్ ఉమాశంకరగణేష్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
పెందుర్తిలో అదీప్ రాజ్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
విశాఖనగరంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దక్షిణ నియోజకవర్గ ఇంఛార్జ్ కోలా గురువుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు. ఈ దీక్షలో పాల్గొన్న గుడివాడ అమర్నాధ్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు గొల్ల బాబురావు, జాన్ వెస్లీ తదితరులు.

విజయనగరం జిల్లా :
బొబ్బిలిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డు సభ్యులు రిలే నిరాహారదీక్షలు.

Advertisement
Advertisement