(సెంట్రల్ డెస్క్): గల్ఫ్ దేశాల్లో అలజడి మొదలైంది. ఆయిల్ నిల్వలతో ప్రపంచాన్ని శాసించిన యూఏఈ, ఖతార్, కువైట్, ఒమన్ దేశాలు ఇప్పుడు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుండటమే ఇందుకు కారణం. 2014లో బ్యారెల్ 114 డాలర్లున్న ధర.. తాజాగా 41 డాలర్ల దగ్గర ఆగింది. ఇది తిరిగి పుంజుకుని 75 డాలర్లకు చేరని పక్షంలో.. గల్ఫ్ దేశాల ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారుతుందని, సౌదీ అరేబియా కోలుకోవాలంటే.. బ్యారెల్ ధర కనీసం 100 డాలర్లకు చేరాల్సిందేనని అంతర్జాతీయ ద్రవ్యనిధి హెచ్చరించింది. దీంతో గల్ఫ్ దేశాలు బడ్జెట్ కుదింపు, సబ్సిడీల తగ్గింపు, ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవటంపైనే దృష్టిపెట్టాయి. ఈ దేశాల్లోని కంపెనీలు జీతాలు, ఇంక్రిమెంట్లలో కోత విధించాయి. దీని ప్రభావం భారత్పై తీవ్రంగా పడనుంది.
గల్ఫ్ దేశాల్లోని వివిధ కంపెనీల్లో దాదాపు 70 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. అందులోనూ కేరళనుంచే ఎక్కువమంది ఉన్నారు. వేతనాలు కూడా భారీగానే ఉండటంతో.. సంపాదనలో కొంత భాగాన్ని స్వదేశానికి పంపించేవారు. ఒక్క కేరళైట్లు వాళ్ల బంధువులకు పంపించే డబ్బు.. ఆ రాష్ట్రానికి కేంద్రం చేసే సహాయానికి 5.5 రెట్లు ఉంటుందని తాజా వివరాలు వెల్లడిస్తున్నాయి. అయితే.. తాజా పరిస్థితులతో.. కంపెనీలు జీతాల్లో కోత విధించటం వీరి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇప్పుడిప్పుడే పలు కంపెనీలు ఉద్యోగస్తుల తొలగింపును మొదలుపెట్టాయి.
ఇదే తీవ్రతరమైతే.. పెద్ద సంఖ్యలో భారతీయులు రోడ్డున పడాల్సిందే. దీనికి తోడు గల్ఫ్ దేశాల్లోని అమానుషమైన కార్మిక చట్టాలు.. ఉద్యోగులు కంపనీలు మారేందుకు సహకరించవు. అయితే అక్కడే పనిచేయాలి.. లేదంటే భారత్కు తిరిగొచ్చి ఉద్యోగమో, వ్యాపారమో చేసుకోవాలి. ఇప్పటికే నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్న భారత్కు గల్ఫ్ దేశాల్లో పరిస్థితి కుదురుకోక.. వారంతా ఇక్కడికి వచ్చేస్తే.. మరిన్ని సమస్యలు తప్పవని ఇందుకు.. ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
అనిశ్చితిలో గల్ఫ్ భారతీయులు
Published Sun, Nov 29 2015 2:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
Advertisement