న్యూఢిల్లీ: విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర బ్లూచిప్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రెండ్ను నిర్దేశిస్తాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఫలితాలతో పాటు డాలరుతో రూపాయి విలువ కదలికలు, చమురు ధర కూడా మార్కెట్పై ప్రభావం చూపుతాయని వారన్నారు. ఇన్ఫోసిస్, హిందుస్థాన్ జింక్, హెచ్సీఎల్ టెక్, విప్రో, కెయిర్న్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్లు క్యూ4 ఆర్థిక ఫలితాలను ఈ వారం వెల్లడిస్తాయని, ఆయా ఫలితాలకు అనుగుణంగా మార్కెట్ హెచ్చుతగ్గులుంటాయని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మంగ్లిక్ చెప్పారు. అలాగే ఏప్రిల్ 20 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు బడ్జెట్ మలిదశ సమావేశాల్లో జరిగే పరిణామాల్ని ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తారని, భూ సేకరణ బిల్లు, జీఎస్టీ బిల్లులపై మార్కెట్ దృష్టివుందని మాంగ్లిక్ వివరించారు.
ఇప్పటికైతే స్వల్పకాలిక ట్రెండ్ కోసం త్రైమాసిక ఫలితాలపై మార్కెట్ ఆధారపడుతుందని, దాంతో ఆయా షేర్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతాయని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేశ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. మార్కెట్ కరెక్షన్ దశలో వున్నపుడు, ప్రతికూల ఫలితాలు వెల్లడించిన కంపెనీల షేర్ల పతనం అధికంగా వుంటుందని, ఇప్పుడు మార్కెట్ అదే దశలో వుందని మాంగ్లిక్ చెప్పారు. శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాలకు ఈ సోమవారం ప్రారంభసమయంలో మార్కెట్ స్పందిస్తుందన్నారు. 2015 మార్చితో ముగిసిన మూడు నెలలకు రూ. 6381 కోట్ల అత్యధిక లాభాన్ని రిలయన్స్ ప్రకటించడం తెలిసిందే.
త్రైమాసిక ఫలితాలే దిక్సూచి..
Published Mon, Apr 20 2015 1:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement