- వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
- స్వస్తి వచనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్న అధికారులు
యాదగిరికొండ: యాదాద్రి శ్రీలక్ష్మీనారసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. సోమవారం నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు 11 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పిస్తున్నారు. చలువ పందిళ్లను సిద్ధం చేశారు. ఆలయంలో తోపులాట జరగకుండా పోలీసు సిబ్బందిని కేటాయించారు. భక్తుల కోసం సుమారు 1 లక్ష చిన్న లడ్డూలు, 50 వేల పెద్ద లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తున్నారు. క్యూలైన్లలో భక్తులకు వలంటీర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయనున్నారు. బాలాలయం చుట్టూ విద్యుద్దీపాలతో అందంగా అలంకరిస్తున్నారు.
ఘాట్ రోడ్డుకు ఇరువైపులా వీధి దీపాలు వేస్తున్నారు. ఆలయంలో హోమ గుండాలను ఏర్పాటు చేశారు. గజ, హనుమంతం, కల్పవృక్షం, శేష, తదితర వాహన సేవలకు పాలిషింగ్ చేశారు. నిత్యం 1500 మందికి అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాలను, గదులను పరిశుభ్రంగా ఉంచాలని శానిటేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రామాయణ, మహాభారత, భాగవత, ఇతిహాసాల పారాయణాల కోసం 75 మంది రుత్విక్కులకు ఇప్పటికే ఆహ్వానాలు పంపించారు. ఉత్సవాల నిర్వహణ కోసం 11 రోజుల పాటు ఆలయ అర్చకులకు, అధికారులకు సెలవులను రద్దు చేశారు.
‘యాదాద్రి’లో భక్తుల రద్దీ
దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సుమారు 25వేల మంది భక్తులు స్వామి,అమ్మవార్లను దర్శించుకున్నారు.
నేటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు
Published Mon, Feb 27 2017 5:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement