విజయవాడ సిటీ : ‘కొత్తలో హడావుడి మామూలే అనుకోవడం పరిపాటి. నేను ఆ టైపు కాదు. ఒక్కొక్క విషయాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను. తద్వారా ప్రజలకు దీర్ఘకాలిక మేలు జరగాలనేది నా అభిప్రాయం. పోలీసులు అంతర్గతంగాను.. బహిర్గతంగా మారాలి. అప్పుడే ఫ్రెండ్లీ పోలీసింగ్ సాధ్యం’ అంటూ నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతమ్ సవాంగ్ చెప్పారు. నగర పోలీసు కమిషనర్గా బాధ్యతలు చేపట్టి నెల రోజులు పూర్తయిన సందర్భంగా గురువారం కమిషనరేట్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఇక్కడ మోసగాళ్లు అధికంగా ఉన్నారనే విషయం గుర్తించినట్టు చెప్పారు. ‘వీరిని గట్టిగా నియంత్రించాలి. నిక్కచ్చిగా ముందుకు వెళుతుంటే ఆపాలంటూ ఫోన్లు వస్తున్నాయి. ఫోన్లు వచ్చినంత మాత్రాన విధి విధానాలు మార్చుకోవడం కుదరదు’ అని స్పష్టం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
పోలీసులు కనిపించాలి
రద్దీ వేళల్లో రోడ్లపై పోలీసులు కనిపించాలి. అప్పడే ప్రజలకు పోలీసులు ఉన్నారనే భరోసా కలుగుతుంది. ముందు దీనిపై దృష్టి పెట్టాను. ఇప్పటికే రద్దీ వేళల్లో తిరగాలంటూ అందరికీ ఆదేశాలు జారీ చేశాను. కొద్ది రోజులు గడిచిన తర్వాత రద్దీ వేళల్లో ఏంచేయాలనే దానిపై నిర్దిష్ట కార్యాచరణ ప్రకటిస్తాను.
విటులను బయటకు లాగుతాం
వ్యభిచార వృత్తిని ఉపేక్షించేది లేదు. మహిళలు, యువతులతో వ్యాపారం చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. పలు ప్రాంతాల్లో వ్యభిచార నిర్వాహకులు ఇళ్లను అద్దెకు తీసుకొని కార్యకలాపాలు సాగిస్తున్నట్టు గుర్తించాం. ఆన్లైన్ ద్వారా విటులను రప్పించుకొని వ్యాపారం చేస్తున్నారు. వీరిని పట్టుకోవడంతో పాటు తరచూ వీరి వద్దకు వచ్చే విటులను కూడా బయటకు లాగి మీడియా సమక్షంలో వెల్లడిస్తాం.
గుట్కాను తరిమి కొడతాం
ప్రమాదకర క్యాన్సర్కు కారణమైన గుట్కాను నగరం నుంచి తరిమికొడతాం. గుట్కా మాఫియాకు సంబంధించిన ఆధారాలు కొంతవరకు సేకరించాం. మరికొంత సమాచారం రావాల్సి ఉంది. ఆపై పోలీసుల చర్యలు ఎలా ఉంటాయో గుట్కా మాఫియాకు రుచి చూపుతాం. తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేసే డాక్యుమెంటు రైటర్లను వదిలేది లేదు. రాజధాని నేపథ్యంలో భూముల విలువలు భారీగా పెరిగాయి. ఒకే స్థలానికి ఒకటికి మించి డాక్యుమెంట్లు తయారుచేసేవారి సంఖ్య పెరిగింది. తప్పుడు డాక్యుమెంట్లతో స్థలాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్టు తెలిసింది. భూ వివాదాల సమయంలో డాక్యుమెంట్లు నకిలీవని తేలితే తయారు చేసిన డాక్యుమెంటు రైటర్ను ప్రాసిక్యూట్ చేస్తాం. ఎవరి ప్రోద్బలంతో తప్పుడు డాక్యుమెంటు తయారు చేశారనేది నిర్ధారించి బాధితులకు న్యాయం చేస్తాం.
అలసత్వం ఉపేక్షించను
పోలీసు అధికారుల్లో అలసత్వాన్ని ఉపేక్షించను. స్టేషన్కి వచ్చే బాధితులతో మంచిగా మాట్లాడటం పోలీసుల బాధ్యత. ఇందుకు ఖర్చేముంటుంది? కచ్చితంగా స్టేషన్కి వచ్చేవారితో మంచిగా మాట్లాడి, చెప్పేది విని న్యాయం చేయాల్సిందే. ఇందుకు విరుద్ధంగా జరిగితే ఉపేక్షించేది లేదు. ఇప్పుడిప్పుడే దీనిపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చాను. మారకుంటే మార్చేస్తాను.
నేను...ఆ టైపు కాదు!
Published Fri, Sep 4 2015 10:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement