* ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టానికి సవరణ
* ప్రతిపక్షాల్లో అతిపెద్ద పార్టీ నేతకు ఎంపిక కమిటీలో స్థానం
* ‘కోరమ్’ సవరణపై కాంగ్రెస్ అభ్యంతరం.. తోసిపుచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: సీబీఐ డెరైక్టర్ ఎంపిక ప్రక్రియకు సంబంధించిన సవరణ బిల్లుకు బుధవారం లోక్సభ ఆమోదం తెలిపింది. కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ ప్రవేశపెట్టిన ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్(సవరణ) బిల్లు-2014ను మూజువాణి ఓటుతో లోక్సభ ఆమోదించింది. సీబీఐ చీఫ్ ఎంపిక కమిటీలో ప్రతిపక్షాల్లో అతిపెద్ద పార్టీ నేతకు స్థానం కల్పిస్తూ ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ చట్టానికి సవరణతో ఈ బిల్లును రూపొందిం చారు. సీబీఐ చీఫ్ ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు లోక్సభలో ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. అయితే లోక్సభలో ప్రతిపక్ష నేత లేని పక్షంలో ఆయన స్థానంలో విపక్షాల్లో అతిపెద్ద పార్టీ నేతకు అవకాశం కల్పించేందుకు తాజా బిల్లు అవకాశం కల్పిస్తుంది.
అయితే సెలెక్షన్ కమిటీలో ఏ ఒక్క సభ్యుడు లేకున్నా (కోరమ్ లేకుంటే) ఎంపిక ప్రక్రియకు విఘాతం కలగకూడదన్న సవరణను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసేందుకు, అతిపెద్ద ప్రతిపక్ష పార్టీని ఎంపిక ప్రక్రియకు దూరంగా ఉంచేందుకే ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. తాజా నిర్ణయం ప్రమాదకరమైనదని, రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ బిల్లును ఉపసంహరించుకుని సమగ్రమైన బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఖర్గేకు బీజేడీ సభ్యులు తథాగత్ సత్పతి, భర్తృహరి మహ్తాబ్ మద్దతు తెలిపారు. ఎంపిక ప్రక్రియ సజావుగా సాగాలనే ఈ బిల్లు తీసుకొచ్చామని మంత్రి జితేంద్రసింగ్ చెప్పారు. ఇలాంటి నిబంధనలు లోక్పాల్, సీవీసీ, నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ చట్టాల్లో ఉన్నాయన్నారు. సీబీఐను బలోపేతం చేసేందుకే ఈ బిల్లును తీసుకొచ్చినట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు.
సీబీఐ బిల్లుకు లోక్సభ ఆమోదం
Published Thu, Nov 27 2014 12:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement