హైదరాబాద్ : తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతోంది. కారు ఎక్కేందుకు తెలుగు తమ్ముళ్లు క్యూ కడుతున్నారు. ఆపార్టీ నుంచి వలసల పర్వం కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో టీడీపీ నుంచి భారీగా టీఆర్ఎస్కు వలసలు జరగగా....తాజాగా నల్గొండ జిల్లాలోనూ ఆపార్టీకి షాక్ తగిలింది. కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఈనెల 5వ తేదీన టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు.
దాంతో అందివచ్చిన అవకాశాన్ని గులాబీ నేతలు బాగానే సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎన్నికలు అయ్యేంత వరకూ సంస్థాగతంగా బలహీనంగా వున్న టీఆర్ఎస్, తెలంగాణ సెంటిమెంట్తో గట్టెక్కింది. ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావడంతో క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు నాయక్తవం వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తోంది. సొంత కేడర్ వున్న నేతలను గుర్తించి గాలం వేస్తోంది. ప్రధానంగా టీడీపీ నాయకులు, శ్రేణులపై దృష్టి పెట్టింది.
కోదాడ నియోజకవర్గం నుంచి సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా పనిచేసిన టీడీపీ సీనియర్ నేత వేనేపల్లి చందర్ రావు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు మరికొందరు కారు ఎక్కనున్నారు. దీంతో కోదాడపై ఎన్నాళ్లగానో పట్టువున్న టీడీపీకి ఇక గడ్డు పరిస్థితి ఎదురు కానుంది. ఇప్పటికే జిల్లాలో టీడీపీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు. మొత్తంగా జిల్లాలో టీఆర్ఎస్ నాయకత్వం పక్కా వ్యూహంతో టీడీపీని టార్గెట్ చేసినట్లే కనిపిస్తోంది.
నల్గొండ జిల్లాలో టీడీపీకి షాక్ ....
Published Wed, Sep 3 2014 9:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement