ఆదిలాబాద్ క్రైం : మహిళలు వారి సమస్యలను పోలీసులకు నిర్భయం గా చెప్పుకోవాలని అదనపు ఎస్పీ (పరిపాలన) జీఆర్ రాధిక అన్నారు. సోమవారం స్థానిక పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల విభాగంలో అర్జీలు స్వీకరించారు. జిల్లా వ్యా ప్తంగా 14 మంది అర్జీ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మహిళల భద్రత కోసం అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా 100, 1091కు ఫోన్ చేస్తే వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుంటారన్నారు.
జిల్లా వ్యాప్తంగా షీ టీం లు ఏ ర్పాటు చేసి అన్ని చోట్ల సిబ్బందిని నియమించామన్నారు. పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్ ప్రాంతాల్లో షీ టీంల నిఘా అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఫిర్యాదుల విభాగం అధికారి శివాజీ చౌహాన్, జైస్వాల్ కవిత, జగదీశ్, కార్యాలయ అధికారులు ఫారుఖ్, అత్తాఉల్లాఖాన్ ఉన్నారు.
పోటీలను సద్వినియోగం చేసుకోవాలి
ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థపై పోలీసు శాఖ నిర్వహించే ఫొటో, వీడియో షార్ట్ ఫిల్మ్ పోటీలను సద్వినియోగం చేసుకోవాలని ఏఎస్పీ జీఆర్ రాధిక పేర్కొన్నారు. ప్రజలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుని పోలీసులు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. వారి సేవలు ప్రతిబింబించేలా పోటీల్లో చిత్రా లు, వీడియో ప్రదర్శనకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మంగళవారంతో గడువు ముగుస్తుందని, పోలీసు పీఆర్వో గురుదేవ్కు నేరుగా ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలన్నారు. 14న విజేతలు ప్రకటిస్తామన్నారు. ఇతర వివరాలకు సెల్నెం. 9440900673కి సంప్రదించాలన్నారు.
ఆదివాసీ చట్టాలకు భంగం కలిగితే ఉద్యమం
ఉట్నూర్ : అన్ని రంగాల్లో అత్యంత వెనుకబాటును అనుభవిస్తున్న ఆదివాసీ గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక చట్టాలు రూపొందించబడ్డాయని, వాటికి భం గం కలిగితే ఆదివాసీ గిరిజనులమంతా ఏకమై ఉద్యమం చేపడుతామని ఆది వాసీ గిరిజన సంఘాల నాయకులు సిడం శంభు, కుడిమెత తిరుపతి, నేతవత్ రాందాస్, బానోత్ రామారావ్, సర్దార్, రాజేందర్ స్పష్టం చేశారు. సోమవా రం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగంలోని చట్టాల్లో మార్పులు తీసుకురావాలని కుట్ర చేస్తే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానించినట్లేనని అన్నారు. గిరిజనేతరుల మధ్య భూములు క్రయవిక్రయా లు జరిగితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు ఏజెన్సీ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి దోచుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలు నిర్భయంగా చెప్పుకోవాలి
Published Tue, Oct 13 2015 3:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement