కూతుర్ని అమ్మిన తండ్రి | Sakshi
Sakshi News home page

కూతుర్ని అమ్మిన తండ్రి

Published Tue, Dec 23 2014 1:44 AM

The girl's father daughter

పాల్వంచ: రెండో సంతానం కూడా ఆడపిల్లే కావడంతో ఓ తండ్రి కూతుర్ని అమ్ముకున్న ఘటన ఖమ్మం జిల్లా పాల్వంచలో చోటు చేసుకుంది. దీనిపై బాలిక తల్లి భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు భవానీ కథనం ప్రకారం.. స్థానిక నెహ్రూనగర్‌లో అద్దెకు ఉంటున్న రాజు, భవానీలకు ఇద్దరు కూతుళ్లు. మొదటి కూతురు వరలక్ష్మికి మూడేళ్లు. కాగా, మూడు నెలల క్రితం మరో అమ్మాయి ధామిని జన్మించింది.

లారీ క్లీనర్‌గా పనిచేస్తున్న రాజుకు ఇద్దరు కూతుర్లను పెంచడం కష్టమనిపించింది. ఈ క్రమంలో వరంగల్ జిల్లా ఏటూరు నాగారానికి చెందిన వ్యక్తులకు చిన్న కూతురును అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని ఆదివారం భార్యతో చెప్పాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అయినా భార్య మాటను కాదని రూ.19 వేలకు అమ్మాయిని విక్రయించేందుకు బేరం కుదుర్చుకున్నాడు.

రూ.10 వేలు తీసుకుని, 10 రోజుల్లో మిగతా రూ.9 వేలు ఇచ్చేలా మాట్లాడుకుని బిడ్డను వారికి అప్పగించాడు. రోదిస్తున్న భార్యను ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నాడు. ఈ విషయాన్ని విజయవాడలో ఉంటున్న తన తండ్రి పెంటయ్యకు భవాని తెలియజేసింది. అతడు పాల్వంచకు వచ్చాక తండ్రి సహాయంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాజును అదుపులోకి తీసుకున్న ఎస్‌ఐ షణ్ముకాచారి ధామినిని తీసుకొచ్చేందుకు తన సిబ్బందిని ఏటూరు నాగారం పంపించారు.

Advertisement
Advertisement