పాల్వంచ: రెండో సంతానం కూడా ఆడపిల్లే కావడంతో ఓ తండ్రి కూతుర్ని అమ్ముకున్న ఘటన ఖమ్మం జిల్లా పాల్వంచలో చోటు చేసుకుంది. దీనిపై బాలిక తల్లి భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు భవానీ కథనం ప్రకారం.. స్థానిక నెహ్రూనగర్లో అద్దెకు ఉంటున్న రాజు, భవానీలకు ఇద్దరు కూతుళ్లు. మొదటి కూతురు వరలక్ష్మికి మూడేళ్లు. కాగా, మూడు నెలల క్రితం మరో అమ్మాయి ధామిని జన్మించింది.
లారీ క్లీనర్గా పనిచేస్తున్న రాజుకు ఇద్దరు కూతుర్లను పెంచడం కష్టమనిపించింది. ఈ క్రమంలో వరంగల్ జిల్లా ఏటూరు నాగారానికి చెందిన వ్యక్తులకు చిన్న కూతురును అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని ఆదివారం భార్యతో చెప్పాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అయినా భార్య మాటను కాదని రూ.19 వేలకు అమ్మాయిని విక్రయించేందుకు బేరం కుదుర్చుకున్నాడు.
రూ.10 వేలు తీసుకుని, 10 రోజుల్లో మిగతా రూ.9 వేలు ఇచ్చేలా మాట్లాడుకుని బిడ్డను వారికి అప్పగించాడు. రోదిస్తున్న భార్యను ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నాడు. ఈ విషయాన్ని విజయవాడలో ఉంటున్న తన తండ్రి పెంటయ్యకు భవాని తెలియజేసింది. అతడు పాల్వంచకు వచ్చాక తండ్రి సహాయంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాజును అదుపులోకి తీసుకున్న ఎస్ఐ షణ్ముకాచారి ధామినిని తీసుకొచ్చేందుకు తన సిబ్బందిని ఏటూరు నాగారం పంపించారు.
కూతుర్ని అమ్మిన తండ్రి
Published Tue, Dec 23 2014 1:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement