తండ్రి మందలించాడని విద్యార్థి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

తండ్రి మందలించాడని విద్యార్థి ఆత్మహత్య

Published Sun, Aug 30 2015 6:12 PM

student suicides in hemlathanda

మేళ్లచెర్వు: తండ్రి మందలించాడని మనస్తాపానికి గురైన ఓ విద్యార్ది బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండలం హేమ్లాతండాలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు,తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పానుగోతు కమల్ (13) మేళ్లచెర్వు లోని ఓ ప్రైవేటు పాఠశాల నందు 8వ తరగతి చదువుతున్నాడు. కమల్ ఇటీవల సరిగా పాఠశాలకు వెళ్లకుండా ఉంటుండడంతో తండ్రి పాఠశాలకు వెళ్లాలని మందలించడండంతో శుక్రవారం ఇంటినుంచి బయటకు వచ్చి గ్రామ శివారులో ఉన్న బావిలో దూకాడు.

కాగా ఇది గమనించని తల్లిదండ్రులు బంధువుల ఇళ్ల వద్ద వెతుకుతండగా ఆదివారం ఉదయం తండాకు చెందిన భీక్యా అనే వ్యక్తి పొలం వద్ద ఉన్న బావి వైపు చూడగా.. మృతదేహం కనిపించింది. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించడంతో వారు వచ్చి కమల్ మృతదేహన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement