సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్లైన్: యువత అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని పాతబస్టాండ్ ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు విద్యావకాశాలను కల్పించడంతో పాటు అర్హులైన విద్యార్థులకు హాస్టల్ వసతిని కల్పించడం జరిగిందన్నారు.
ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. జిల్లాలో నిరక్షరాస్యతా శాతం రోజురోజుకు తగ్గిపోతోందన్నారు. దళిత సంఘాల నాయకులు సామాజిక సేవా దృక్పథంతో బడికి దూరంగా ఉన్న పిల్లలను బడిలో చేర్పించేందుకు కృషి చేయాలన్నారు. ప్రస్తుతం ఆంగ్ల బాషవైపు మొగ్గు చూపడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని అందుకు ప్రతి మండల కేంద్రంలో ఆంగ్ల భాషలో బోధించేందుకు మోడ ల్ పాఠశాలలను ప్రారంభించడం జరిగిందని ఈ పాఠశాలలో 6 నుంచి ఇంటర్ వ రకు హాస్టల్ వసతితో పాటు ఆంగ్ల భాషలో బోధించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థి పాఠశాలలోనే ఉండాలని అంతే తప్ప పనిలో ఉండరాదని సూచించారు. అదనపు ఎస్పీ మధుమోహన్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కుల వివక్షత ఎక్కడైనా ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. కార్యక్ర మంలో డీఆర్వో దయానంద్, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు సత్యనారాయణతో పాటు దళిత సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో అదనపు జేసీ మూర్తి హాజరయ్యారు. అనంతరం ఏజేసీ మాట్లాడుతూ అంబేద్కర్ కృషి ఫలితంగానే విద్యావకాశాలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారన్నారు. గ్రామీణ వికాస్ బ్యాంక్ జిల్లా కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంజీవరావు అంబేద్కర్ సేవలను కొనియాడారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి జిల్లా ప్రధాన కార్యదర్శి అడివయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలి
Published Tue, Apr 15 2014 12:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement