తిప్పర్తిలో దొంగల బీభత్సం | Sakshi
Sakshi News home page

తిప్పర్తిలో దొంగల బీభత్సం

Published Mon, Feb 8 2016 6:14 PM

Robbery in 3 villages

తిప్పర్తి (నల్లగొండ జిల్లా) : తిప్పర్తి మండలంలో సోమవారం దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా మూడు గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. బంగారం, వెండి, నగదుతో పాటు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. మాడ్గులపల్లి గ్రామంలో చిలుముల శ్రీనివాస రెడ్డి ఇంట్లో 60 వేల నగదు, 3 తులాల బంగారం దొంగిలించారు.

ఇండ్లూర్ గ్రామపంచాయితీ వడ్డెర గూడెంలో పల్లపు లింగయ్య ఇంట్లో 3 తులాల బంగారం, 40 తులాల వెండి, 10 వేల నగదును దొంగిలించారు. చెర్వుపల్లి గ్రామంలో తోట దగ్గర ఉన్న ఇంట్లో ఒక కలర్ టీవీని ఎత్తుకెళ్లారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement