పెబ్బేరు/భూత్పూర్: రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కరువు నివారణ చర్యలు చేపట్టాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా తెలంగాణలో పూర్తి కరువు ఏర్పడిందన్నారు. ఆదివారం మే డే వేడుకల్లో భాగంగా ఆయన మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్, పెబ్బేరు మండలాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ని నాలుగు జిల్లాల్లో జేఏసీ ఆధ్వర్యంలో కరువు పరిస్థితిపై అధ్యయనం చేసి నివేదికలను జిల్లాల కలెక్టర్లతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మకు అందజేశామని వివరించారు.
త్వరలో గవర్నర్ నరసింహన్నూ కలవనున్నట్లు తెలిపారు. పంటలు, పండ్లతోటలు దెబ్బతిని రైతులు అప్పులపాలయ్యారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కనీసం ఎకరాకు రూ.10 వేలు తగ్గకుండా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులను ఇప్పుడు ఆదుకుంటేనే వచ్చే ఖరీఫ్లో తిరిగి పంటలు సాగు చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయి చెరువులను నీటితో నింపి ఉంటే ఇంతటి కరువు వచ్చేది కాదన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని కోరారు. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో వృద్ధులు, వికలాంగులకు కూడా మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని ఆయన కోరారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా టీజేఏసీ పాత్ర ప్రముఖంగా ఉంటుందని కోదండరాం స్పష్టంచేశారు.
కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువస్తున్న సరళీకరణ చట్టాల ఫలితంగా కార్మికుల సంక్షేమం డోలాయమానంలో పడిందని కోదండరాం ఆవేదన వ్యక్తంచేశారు. కాంట్రాక్ట్, ఒప్పంద ఉద్యోగులను నియమిస్తూ ప్రభుత్వాలు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నాయని చెప్పారు. చట్టాలను పకడ్బందీగా అమలు చేసినప్పుడే కార్మికులకు న్యాయం జరుగుతుందన్నారు.
యుద్ధప్రాతిపదికన కరువు నివారణ చర్యలు
Published Mon, May 2 2016 3:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement