'నయీం అనుచరులతో ప్రాణభయం' | Sakshi
Sakshi News home page

'నయీం అనుచరులతో ప్రాణభయం'

Published Wed, Aug 24 2016 5:31 PM

'నయీం అనుచరులతో ప్రాణభయం'

కరీంనగర్: గ్యాంగ్స్టర్ నయీం అనుచరులతో తమకు ప్రాణభయం ఉందని నయీం బాధితులు ఆరోపించారు. కరీంనగర్లో నయీం బాధితులు బుధవారం మీడియాను ఆశ్రయించారు.

ఈ సందర్భంగా బాధితులు వీరలక్ష్మీ, కాంతారావు, రియల్టర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ...14 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దర్ని మాత్రమే అరెస్ట్ చేశారన్నారు. నగునూరు భూ ఆక్రమణలో నయీం, అతని అనుచరులు ఉన్నారని చెప్పారు. భూ ఆక్రమణలతో ప్రమేయమున్న అందరినీ అరెస్ట్ చేయాలని నయీం బాధితులు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement