మోగిన నార్మాక్ ఎన్నికల నగారా
మూడు డెరైక్టర్ల పదవులకు నోటిఫికేషన్
జిల్లాకు రెండు, రంగారెడ్డికి ఒకటి రిజర్వ్ స్థానాలను గెలుచుకునేందుకు అధికార పార్టీ వ్యూహం
భువనగిరి : నల్లగొండ- రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (నార్మాక్) ఎన్నికల నగారా మోగింది. గుత్తా జితేందర్రెడ్డి చైర్మన్గా ఉన్న ఈ పాలకవర్గంలో 15మంది డెరైక్టర్లు ఉన్నారు. ఈ నెలాఖరులోగా డెరైక్టర్లు కాయితి వెంకట్రెడ్డి, మడూరి రంగారెడ్డి, రాంరెడ్డిల పదవీ కాలం ముగుస్తుంది. వీరిస్థానంలో మరో ముగ్గురిని ఎన్నుకోనున్నారు. ఈ 3 డెరైక్టర్ల స్థానాల్లో 2 జిల్లాకు, ఒకటి రంగారెడ్డి జిల్లాకు రిజర్వు చేశారు. ఈ మేరకు ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల వల్ల అధికార టీఆర్ఎస్ ఈ స్థానాలపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ కుదిరితే పొత్తు.. లేకపోతే ఎన్నికలను ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. నల్లగొండ- రంగారెడ్డి జిల్లాల్లోని 21 చిల్లింగ్ సెంటర్ల పరిధిలో 421మంది పాల సొసైటీ అధ్యక్షులు నూతన డెరైక్టర్లను ఎన్నుకోనున్నారు.
గ్రామాల్లో రాజకీయ వేడి..
మదర్డెయిరీ ఎన్నికలు అనగానే గ్రామాల్లో ఎన్నికల వేడి మొదలవుతుంది. అయితే ఈసారి మారిన ప్రభుత్వం, రాజకీయ నేపధ్యంలో టీఆర్ఎస్ డెరైక్టర్ల స్థానాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి మోతె పిచ్చిరెడ్డి ఇటీవల భువనగిరి చిల్లింగ్ సెంటర్ పరిధిలో అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ఆ విచారణ కొనసాగుతోంది. మరోవైపు 421మంది సొసైటీ చైర్మన్లలో 200 మంది వరకు భువనగిరి, ఆలేరు, మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచే ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ మేరకు జిల్లాకు చెందిన రాష్ట్రమంత్రి జి.జగదీష్రెడ్డి జిల్లాకు కేటాయించిన రెండు డెరైక్టర్ల స్థానాలను కైవసం చేసుకోవడానికి పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. కాగా ఈసారి ఎన్నికలు పోటాపోటీగా జరుగుతాయా లేదా ప్రస్తుతం ఉన్న చైర్మన్, పాలకవర్గం.. అధికార పార్టీతో పొత్తు పెట్టుకొని స్థానాలను పంచుకునే అవకాశాలు లేకపోలేదని పాడి రైతులు తెలుపుతున్నారు.
ఎన్నికల షెడ్యూల్
ఈ నెల 23న ఉదయం 10 నుంచి 2 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ 24న నామినేషన్ల పరిశీలన 25న ఉపసంహరణ 29న ఎన్నికలు, (మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఎన్నికలు, 2 గంటల తర్వాత లెక్కింపు) మూడు నామినేషన్లు వస్తే ఏకగ్రీవమైనట్లు ప్రకటిస్తారు..లేకపోతే రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహిస్తారు.
పోటీనా.. పొత్తా!
Published Mon, Sep 22 2014 1:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బెంగాల్ గవర్నర్పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Pooja Hegde: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ
వివాదాస్పద భూభాగాలతో రూ.100 నోట్ ముద్రించాలని నిర్ణయం
ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన
నీ ముఖానికి డ్యాన్సా? ట్రోలింగ్పై స్పందించిన నటి
చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్
‘అతడు 70 శాతం ఇండియన్.. 30 శాతం మాత్రమే ఆస్ట్రేలియన్’
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
Advertisement