► మరో నలుగురికి తీవ్ర గాయాలు
► ట్రెయిలర్ లారీ పైనుంచి పక్కన వెళుతున్న ఆటోపై పడిన రాడ్లు
► మృతులంతా అస్సాం రాష్ట్రానికి చెందిన కూలీలే
► సంగారెడ్డి జిల్లా ఇంద్రకరణ్ వద్ద ఘటన
సాక్షి, సంగారెడ్డి రూరల్
ఓ ట్రెయిలర్ లారీలో తరలిస్తున్న ఇనుప రాడ్లు ఆటోపై కూలిపడడంతో నలుగురు కూలీలు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎగుడుదిగుడుగా ఉన్న మట్టి రోడ్డు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా అస్సాం రాష్ట్రానికి చెందిన కూలీలే. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ్ వద్ద సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది.
పనికోసం వెళుతూ..
ఇంద్రకరణ్ గ్రామ శివారులో నువోసాల్ అనే సోలార్ కంపెనీ నిర్మాణం జరుగుతోంది. ఆ కంపెనీ షెడ్డు నిర్మాణం కోసం సోమవారం రాత్రి ఓ ట్రెయిలర్ లారీలో పర్లిన్ బండిల్స్ (షెడ్డు పైకప్పు వేసేందుకు ఉపయోగించే ఇనుప రాడ్లు)ను తీసుకువచ్చారు. అయితే అప్పటికే రాత్రి 7.30 దాటిపోవడంతో తాము అన్లోడ్ చేసుకోబోమంటూ కంపెనీ ప్రతినిధులు తిప్పి పంపారు. ఇదే సమయంలో ఆ కంపెనీలోనే క్యాజువల్ కార్మికులుగా పనిచేస్తున్న అస్సాం కార్మికులు కొందరు ఓ ఆటోలో పనికోసం వస్తున్నారు. ఎదురుగా వస్తున్న ట్రెయిలర్ లారీని చూసిన ఆటో డ్రైవర్ కాస్త పక్కగా జరిపి నిలిపాడు. అయితే రోడ్డు ఎగుడుదిగుడుగా ఉండడంతో.. ట్రెయిలర్ తీవ్రంగా ఊగి పర్లిన్ బండిల్స్ ఆటోపై పడిపోయాయి. దీంతో అందులో ఉన్న సరోజ్కుమార్ (28), సూరజ్ కుమార్ భక్తా (23), చుట్టూ భక్తా (18), సుధామ (20) అక్కడికక్కడే మృతి చెందారు. పటాన్చెరు మండలం క్యాసారానికి చెందిన ఆటోడ్రైవర్ పాండుగౌడ్తో పాటు అస్సోంకు చెందిన మానస్ మజ్జి, రూబెన్, ప్రదీప్లు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా అస్సాం రాష్ట్రంలోని నవగాం జిల్లా ఇటాసలి పంచాయతీ సమితి పరిధిలోని బర్హాపూర్ వాసులుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇనుపరాడ్లు పడి నలుగురు మృతి
Published Mon, Jan 23 2017 10:26 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
నిప్పుల కొలిమి..
బీజేపీ అధికారంలోకి వస్తే భవిష్యత్ అంధకారం
తప్పక చదవండి
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement