భార్యను హతమార్చిన భర్త | Sakshi
Sakshi News home page

భార్యను హతమార్చిన భర్త

Published Thu, Nov 26 2015 11:54 AM

Husband Kills His Wife At Mahabubnagar district

మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లాలో బుధవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. అగ్ని సాక్షిగా తాళి కట్టిన భర్తే, భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చాడు.

తలకొండపల్లి మండలం తడక తండాకు చెందిన  శారద(30)కు భర్త ఈస్రాతో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి భర్త మద్యం మత్తులో భార్యను గొడ్డలితో నరికాడు. దీంతో శారద అక్కడిక్కడే మరణించడంతో, భర్త ఈస్రా పరారయ్యాడు. గురువారం ఉదయం సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వానికి తరలించారు.
 

Advertisement
Advertisement