దంపతుల ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

దంపతుల ఆత్మహత్య

Published Mon, Mar 6 2017 10:35 AM

Financial problems drive couple to suicide

జెన్నారం(మంచిర్యాల): మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ కలహాలతో సతమతమవుతున్న వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

జెన్నారం మండలం ధర్మారం గ్రామానికి చెందిన దుర్గం ధర్మరాజు(80), పోచవ్వ(70) దంపతులు గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతన్నారు. ఈ క్రమంలో భూమి విషయంలో కొడుకుతో మనస్పర్థలు రావడంతో మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement