♦ కన్వీనర్ కోటాలో గతేడాది కన్నా తగ్గిన సీట్లు
♦ సీట్లు 62,746.. వెరిఫికేషన్ చేయించుకున్న వారు 64,340
♦ గతేడాది 5 వేల సీట్లు అదనం.. ఈసారి 1,594 సీట్లు తక్కువ
♦ కన్వీనర్ కోటా ప్రవేశాలకు ముగిసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్
♦ నేడు వెబ్ ఆప్షన్లలో మార్పులకు అవకాశం.. 28న సీట్లు కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: ఈసారి ఇంజనీరింగ్లో విద్యార్థులకు కోరుకున్న కాలేజీల్లో సీట్లు లభిం చడం కొంచెం కష్టంగా మారింది. కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్న సీట్లు తక్కువగా ఉండటం.. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. గతేడాది కన్వీనర్ కోటాలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరైన విద్యార్థుల సంఖ్య కన్నా 5 వేలకు పైగా ఎక్కువ సీట్లున్నాయి. ఈ సారి విద్యార్థుల సంఖ్య కంటే 1,594 సీట్లు తక్కువగా ఉన్నాయి. దీంతో ఎక్కువ మంది కోరుకున్న కాలేజీల్లో సీట్లు లభించడం కాస్త కష్టమే.
గతేడాది కన్వీనర్ కోటాలో 71,066 సీట్లు అందుబాటులో ఉండగా, వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న 66,566 విద్యార్థుల్లో మొదటి దశ కౌన్సెలింగ్లో 57,789 మందికే సీట్లు లభించాయి. ఈ సారి కన్వీనర్ కోటాలో 62,746 సీట్లు అందుబాటులో ఉండగా, గురువారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ముగిసే సమయానికి 64,340 మంది హాజరయ్యారు. వెరిఫికేషన్ కు హాజరైన విద్యార్థుల కన్నా 1,594 సీట్లు తక్కువగా ఉన్నాయి. ఈ లెక్కన ఎంత మందికి మొదటి దశ కౌన్సెలింగ్లో సీట్లు లభి స్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.
మేనేజ్మెంట్ కోటా వైపు మొగ్గు..!
కన్వీనర్ కోటాలో కోరుకున్న కాలేజీల్లో సీట్లు లభిస్తాయో లేదోనన్న అనుమానంతో డబ్బు చెల్లించగలిన వారు మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. గతేడాది కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా సీట్లు మొత్తం 1.04 లక్షలుండగా, ఎంసెట్లో 1.06 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించారు. కానీ ఈ సారి మొత్తం సీట్లు 92,700 వరకు ఉండగా, అర్హులు మాత్రం 1.03,500 మంది ఉన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి 11 వేల సీట్లు తగ్గిపోయాయి. దీనివల్ల కూడా మేనేజ్మెంట్ కోటాకు డిమాండ్ ఏర్పడింది.
వెబ్ ఆప్షన్లలో మార్పులకు అవకాశం..
ఇంజనీరింగ్ ఎంసెట్ వెరిఫికేషన్ గురువారంతో ముగిసింది. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోనివారు ఈ నెల 23న ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ వెల్లడించారు. ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులు శుక్రవారం తమ ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి ఈ నెల 28న రాత్రి 8కు సీట్లు కేటాయించనున్నారు. జ్టి్టpట://్టట్ఛ్చఝఛ్ఛ్టి.nజీఛి.జీn వెబ్సైట్లో వివరాలను ఉంచుతామని వివరించారు.
సీట్లు తక్కువ.. విద్యార్థులు ఎక్కువ
Published Fri, Jun 23 2017 2:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
తప్పక చదవండి
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement