చర్చాగోష్టిలో వక్తలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ తెలుగు భాషకు నిఘంటువు రూపొందించాల్సిన అవసరం ఉందని పలువురు భాషావేత్తలు అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాల యంత్రి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సోమవారం నాంపల్లిలోని తెలుగువర్సిటీ సమావేశ మందిరంలో భాషాభివృద్ధి పీఠం, నిఘంటు నిర్మాణ శాఖ ‘తెలంగాణ తెలుగు నిఘంటువు-నిర్మాణ ప్రణాళిక’ అనే అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు.
తెలంగాణ పది జిల్లాలలో ఉన్న భాషలోనుంచి అన్ని ప్రాంతాల పదాలను స్వీకరిస్తూ తెలంగాణ ప్రామాణిక భాషను రూపొందించాలని, ఆ తర్వాత నిఘంటు నిర్మాణం జరగాలని అన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య కె.తోమాసయ్య అధ్యక్షోపన్యాసం చేస్తూ తెలంగాణ ప్రామాణిక భాష రూపొందించుకున్నప్పటికీ ఇతర ప్రాంతాల మాండలికాలను సమానంగా గౌరవించాలని అభిప్రాయపడ్డారు. ప్రామాణిక భాషను పాఠ్య పుస్తక రచనకు, అధికార వ్యవహారాలకు, మీడియా అవసరాలకు వినియోగించాలని అన్నారు.
ప్రముఖ భాషావేత్త ఆచార్య ఎ.ఉషాదేవి మాట్లాడుతూ నిఘంటు నిర్మాణానికి అనుసరిస్తున్న శాస్త్రీయ పద్ధతినే తెలంగాణ నిఘంటువు నిర్మాణానికి కూడా వర్తింప చేయాలని కోరారు. విషయ సేకరణ, వడపోత, అర్థ నిర్ణ యం నిఘంటు నిర్మాణంలో ప్రధానమని సూచించారు. డాక్టర్ భుజంగరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని మాండలికాలనీ కలిపి ఒక ప్రామాణిక భాషగా రూపొందించాలని అన్నారు. తన వాదనకు ఆయన శాసనాధారాలు చూపారు.
రెండవ సదస్సుకు ఆచార్య కె.ఆశీర్వాదం అధ్యక్షత వహించారు. జకోస్లోవేకియా రెండు గా విడిపోయిన..జక్ దేశం నుంచి వచ్చిన ఆచార్య ఎరస్లౌ వాచక్, కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు జి.ఉమా మహేశ్వరరావు, ఎం.సత్యనారాయణ, ఆచార్య కె.రమణ య్య, జి.ఎస్.గాబ్రియేల్, వారణాసి మాధవ శర్మ, దేవీ లాల్, ఆచార్య వి.స్వరాజ్య లక్ష్మి, డాక్టర్ వడ్ల సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు. నిఘంటు నిర్మాణ శాఖ అధిపతి డాక్టర్ వై.రెడ్డి శ్యామల చర్చాగోష్టికి సమన్వయకర్తగా వ్యవహరించారు.
నిఘంటువు రూపొందించాలి
Published Tue, Dec 1 2015 1:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement