జగిత్యాల: ముఖ్యమంత్రి కేసీఆర్కు అగ్రికల్చర్ లీడర్షిప్–2017 కేంద్ర పురస్కారం వరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని సీఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్రెడ్డి అన్నారు. ఆదివారం జగిత్యాలలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో పెట్టుబడులు లేక పంటలకు గిట్టుబాటు ధర లభించక, పంట రుణాలు అందక, రుణ మాఫీ జరగక వ్యవసాయ రంగం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్ను కేంద్ర పురస్కారానికి ఎంపిక చేయడాన్ని పరిశీలిస్తే దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కేంద్ర వ్యవసాయ విధానం అమలు తీరు ఎలా ఉందో అర్థమవుతోందని విమర్శించారు.
సాగుకు పెట్టుబడులు, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం ప్రధానాంశాలని, పంటకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఒకవేళ గిట్టుబాటు ధర తక్కువగా ఉంటే బోనస్ ప్రకటించి ఆ వ్యత్యాసాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు. వరికి క్వింటాల్కు రూ.3వేలు కల్పించాలని, పప్పు దినుసులు, పసుపు, మిర్చి పంటలకు రూ.10వేల గిట్టుబాటు ధర కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం పరిగణనలోకి తీసుకోకపోవడం బాధాకరమన్నారు.
ఖరీఫ్ ప్రారంభమై రెండున్నర నెలలు పూర్తవుతున్నా ఇప్పటికీ 30శాతానికి మించి రైతులకు పంట రుణం అందలేదన్నారు. నాడు రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. 2004–2009 వరకు వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో వ్యవసాయ రంగం స్వర్ణయుగాన్ని తలపించిందన్నారు. రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు, సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు రూ.5వేల ప్రోత్సాహకం, పప్పుదినుసులకు రూ.200, వరికి రూ.50 బోనస్ కల్పించి రైతులకు భరోసా ఇచ్చారని జీవన్రెడ్డి చెప్పారు.
వైఎస్ హయాం స్వర్ణయుగం: జీవన్రెడ్డి
Published Sun, Aug 20 2017 8:24 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement