- తేరేట్పల్లిలో 5 కుటుంబాలతో మాట్లాడిన అమిత్ షా
- కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఆరా
- తమకేమీ తెలియదని చెప్పడంతో కరపత్రాల అందజేత
- చేనేత కార్మికుడి ఇంట్లో మగ్గం నేత
సాక్షి, నల్లగొండ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సోమవారం తేరేట్పల్లి గ్రామంలోని ఐదు కుటుంబాలతో ముఖాముఖి మాట్లా డారు. వారి ఇళ్లలోకి వెళ్లి అందరినీ పలకరిస్తూ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. తొలుత గ్రామ శివారులో పార్టీ పతాకాన్ని ఆవిష్కరిం చిన తర్వాత ఆయన నేరుగా గ్రామంలోని గొరిగె సత్తయ్య ఇంటికి వెళ్లారు. ఇంట్లోకి వెళ్తూనే వారిని చిరునవ్వుతో పలకరిస్తూ అభి వాదం చేశారు. బాగున్నారా అని పలకరించి మీకున్న ఇబ్బందులేంటో చెప్పండని అడిగారు. వారు గ్రామ సమస్యలను అమిత్ షాకు విన్న వించుకున్నారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకాలను గురించి అడగ్గా.. తమకేమీ తెలియదని వారు బదులివ్వడంతో వారి చేతిలో కరపత్రం పెట్టి బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అందులో ఉందని, చదివి అవగాహన చేసుకోవాలని సూచించారు. తర్వాత గొరిగె యాదయ్య, పెద్ద భిక్షమయ్య, సత్తయ్య, వర్కాల ధనుంజయ ఇళ్లకు కూడా వెళ్లారు. వారి బాగోగులు, స్థితిగతులను అడిగి తెలుసుకున్న ఆయన.. అందరితో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ఆరా తీశారు. వారంతా తమకేమీ తెలియదని బదులివ్వడంతో అందరికీ కరపత్రాలు ఇచ్చి చదివి తెలుసుకోవాలని సూచించారు. మొత్తం 15 కుటుంబాలను కలిసేందుకు ఏర్పాట్లు చేసినా ఐదు కుటుంబాలతోనే అమిత్ షా ముఖాముఖి పరిమితమైంది. ఒక్కో కుటుంబం వద్ద 5–6 నిమిషాలున్నారు.
నేనూ నేస్తా: చేనేత కార్మికుడు వర్కాల ధనుంజయ ఇంటికి వెళ్లిన అమిత్ షా అక్కడ మగ్గం నేశారు. మగ్గం వద్దకు వెళ్లి దాని గురిం చి అడిగి తెలుసుకున్న ఆయన.. ధనుంజయ ను మగ్గం నేయాలని కోరారు. అందుకు ఆయన తన భార్య ధనమ్మతో కలసి మగ్గం నేసి చూపించారు. ఆ తర్వాత ‘నేను నేస్తా.. ఇటు రండి..’ అంటూ మగ్గంపై కూర్చుని నేశారు. షా వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్, నాయకులు మురళీధర్రావు, మనోహర్రెడ్డి ఉన్నారు.
తొలిరోజు పర్యటన ప్రశాంతం
మునుగోడు, నల్లగొండ నియోజకవర్గాల్లో అమిత్ షా టూర్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తొలిరోజు నల్లగొండ జిల్లా పర్య టన ప్రశాంతంగా ముగిసింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మీదు గా చండూరు మండలం తేరేట్పల్లి చేరుకున్న ఆయన అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొ న్నారు. తొలుత పార్టీ పతాకాన్ని ఆవిష్క రించి, తర్వాత 5 కుటుంబాలతో ముఖా ముఖి మాట్లాడారు. తర్వాత పార్టీ దివంగత నేత గుండగోని మైసయ్య గౌడ్ విగ్రహాన్ని ఆవి ష్కరించి, పోలింగ్ బూత్ కమిటీ సమా వేశంలో పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో దళిత వాడకు వెళ్లి అక్కడ సహపంక్తి భోజనం చేశారు. మునుగోడు మీదుగా నల్లగొండ చేరుకుని మేధావులతో భేటీ అయ్యారు. తర్వాత పార్టీ రాష్ట్ర పదాధికారులు, అన్ని జిల్లాల అధ్యక్షులతో సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చించారు. షా రాక సంద ర్భంగా చౌటుప్పల్లో ఆప్ కార్యకర్తలు నిరస న తెలిపారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటూ ఎమ్మార్పీ ఎస్ కార్యకర్తలు ఆందోళన చేయబోగా పోలీసులు వారిని నిర్బంధించారు.
బాగున్నారా? మీ సమస్యలేంటి?
Published Tue, May 23 2017 2:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement