ఆటోబోల్తా.. 7నెలల బాలుడు సహా మహిళ మృతి | Sakshi
Sakshi News home page

ఆటోబోల్తా.. 7నెలల బాలుడు సహా మహిళ మృతి

Published Tue, Mar 3 2015 4:58 AM

ఆటోబోల్తా.. 7నెలల బాలుడు సహా మహిళ మృతి - Sakshi

దుమ్ముగూడెం: దైవ దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళతో పాటు ఓపసిబాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం అర్ధరాత్రి  చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. చర్ల మండలం తేగడ గ్రామానికి చెందిన 19 మంది టాటాఎస్‌లో విజయవాడ కనకదుర్గ దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయూణంలో నలుగురు సారపాకలో దిగిపోయూరు. మిగిలిన 15 మందితో ఉన్న వాహనం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో మండలంలోని చిననల్లబల్లి గ్రామం చేరుకునే సమయానికి ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఓ భారీ చెట్టును ఢీకొట్టింది.

దీంతో వాహనం ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ప్రమాదంలో తేగడకు చెందిన పొన్నపు నాగమణి(50) తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మద్ది శ్యాంసుందర్‌రెడ్డి(9నెలలు)ను  ములకపాడు వెద్యశాలకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఇదిలా ఉండగా పసిబాలుని తల్లి మద్ది లక్షి , పొన్నపు సత్యనారాయణ లతో పాటు మరో ఇద్దరి  తలలకు బలమైన గాయాలు అయ్యాయి. వీరిని 108 సహాయంతో భద్రాచలం తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన ప్రయాణీకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Advertisement
Advertisement