కబడ్డీ పోటీలు ప్రారంభించిన స్పీకర్‌ | Sakshi
Sakshi News home page

కబడ్డీ పోటీలు ప్రారంభించిన స్పీకర్‌

Published Tue, Jan 10 2017 11:58 AM

కబడ్డీ పోటీలు ప్రారంభించిన స్పీకర్‌

జయశంకర్‌ భూపాలపల్లి : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అంబేద్కర్‌ స్టేడియంలో యువజన, క్రీడల శాఖ ఆధ్వర‍్యంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను తెలంగాణ శాసనసభా స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి ప్రారంభించారు. ఈ పోటీల్లో 14 సంవత్సరాల్లోపు బాలబాలికలు పాల్గొంటారు. అనంతరం భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు పాఠాలు ఏవిధంగా చెబుతున్నారని, పాఠశాలలో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
 

Advertisement
Advertisement