సాక్షి, చెన్నై: డీఎంకేలో మళ్లీ అన్నదమ్ముళ్ల సమరం రసకందాయంగా సాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. బహిష్కరణకు గురైన అళగిరిని మళ్లీ ఆహ్వానించేందుకు తగ్గ ప్రయత్నాల్లో తండ్రి, అధినేత కరుణానిధి నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. కరుణానిధి దూత అళగిరితో మంతనాల్లో ఉన్న సమాచారం డీఎంకేలో చర్చకు దారి తీసింది. ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించి దూకుడు పెంచి ఉన్న తమ్ముడు స్టాలిన్కు అన్నయ్య ద్వారా చెక్ పెట్టే ప్రయత్నాల కరుణానిధి ఉన్నట్టుగా సంకేతాలు వస్తుండడం ఉత్కంఠను రేపుతోంది.
డీఎంకే అధినేత కరుణానిధి వారసులు అళగిరి, ఎంకే స్టాలిన్ల మధ్య నిరంతర రాజకీయ సమరం సాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సమరంలో అళగిరి బహిష్కరణ వేటుకు గురయ్యారు. మళ్లీ పార్టీలో తనను కలుపుకునేందుకు అళగిరి తీవ్రంగా ప్రయత్నించినా, తండ్రి కరుణ మనస్సు మాత్రం కరగ లేదు. అసెంబ్లీ ఎన్నికల ముందుగా మనకు..మనమే అంటూ స్టాలిన్ సాగించిన పర్యటనతో అళగిరి వర్గం తమ్ముడి గొడుగు నీడన చేరక తప్పలేదు.
అళగిరి వర్గీయులు దాదాపుగా స్టాలిన్ వెంట ఉన్నా, చడీచప్పుడు కాకుండా అన్నయ్యకు సమాచారాలు మోయడంలో సిద్ధహస్తులు ఎక్కువే. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో అధికారం తమ చేతికి చిక్కినట్టే అన్న ఆనందంలో ఉన్న కరుణానిధికి చివరకు మిగిలింది నిరాశే. బలమైన ప్రధాన ప్రతి పక్షంగా అవతరించడం కొంత మేరకు ఊరటే. అయితే, డీఎంకేలో అసలు వార్ ఎన్నికల అనంతరం చాపకింద నీరులా సాగుతూ వస్తున్నట్టు ప్రచారం. డీఎంకే అధినేత కరుణానిధి, ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించిన దళపతి స్టాలిన్ మధ్య ఈ వార్ అన్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా పరిస్థితులు చోటు చేసుకుంటూ వస్తున్నాయి.
ఎన్నికల సమయంలో స్టాలిన్ను సీఎం అభ్యర్థిగా కరుణానిధి ప్రకటించి ఉంటే, అధికారంలోకి వచ్చి ఉండే వాళ్లం అంటూ పలువురు పార్టీ నేతలు పెదవి విప్పడం ఈ వార్కు ఆజ్యం పోసినట్టు సమాచారం. పైకి కరుణానిధి మీద పార్టీ వర్గాలు అభిమానం, గౌరవం చూపిస్తూ వస్తున్నా, తమ పూర్తి భక్తిని మాత్రం స్టాలిన్ మీద చాటుకునే పనిలో మెజారిటీ శాతం మంది ఉన్నారని చెప్పవచ్చు. కరుణానిధి చెంతకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గడం, ఎవరైనా సరే స్టాలిన్ను కలవాల్సిందే అన్నట్టుగా పరిస్థితి డీఎంకేలో మారింది. రోజురోజుకు స్టాలిన్ దూకుడు పెంచడంతో కరుణానిధి నాలుగు గోడల మధ్య పరిమితం అవుతున్నారని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో స్టాలిన్ దూకుడుకు కల్లెం వేయాలంటే మళ్లీ అన్నయ్యను రంగంలోకి దించాల్సిందే అన్న నిర్ణయానికి కరుణానిధి వచ్చినట్టుగా సమాచారం.
దీంతో కరుణానిధి తరఫున దూత అళగిరితో మంతనాల్లో ఉన్నారు. తండ్రి ఆశీస్సుల్ని అందుకుని పార్టీలోకి మళ్లీ వచ్చేందుకు తగ్గ మార్గాన్ని సిద్ధం చేసుకోవాలని ఆ దూత అళగిరికి సూచించినట్టు డీఎంకేలో చర్చ సాగుతున్నది. కరుణానిధి నుంచి వచ్చిన దూత సూచనల్ని పాటించేందుకు అళగిరి సిద్ధంగా ఉన్నా, పార్టీ వ్యవహారాలన్నింటినీ పరోక్షంగా తన చేతిలోకి స్టాలిన్ తీసుకుని ఉండడం గమనించాల్సిన విషయం. ఈ పరిణామాలు డీఎంకే బ్రదర్స్ మధ్య మరో మారు రాజకీయ సమరం రసకందాయంగా సాగే అవకాశాలు ఎక్కువే. అయితే, డీఎంకే వర్గాలు మాత్రం, ఇక అళగిరిని ఆహ్వానించే ప్రసక్తే లేదని, ఇక అంతా స్టాలిన్ హవా అన్నట్టుగా స్పందిస్తుండడం గమనార్హం.
మళ్లీ అన్నయ్య?
Published Wed, Jul 27 2016 2:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement