కోటి రూపాయలు డిమాండ్.. నలుగురు కిడ్నాపర్ల అరెస్టు
టీనగర్(చెన్నై): చెన్నైలో తెలంగాణాకు చెందిన ఐటీ ఇంజనీర్ను దుండగులు కిడ్నాప్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేశారు. పోలీసులు పక్కా వ్యూహంతో నలుగురు కిడ్నాపర్లను అరెస్టు చేసి బాధితుడిని విడిపించారు. తెలంగాణ లోని ఖమ్మం జిల్లా సీతారాంపురం ప్రాంతానికి చెందిన దేవరాజ్ కుమారుడు ప్రేమ్కుమార్(28) చెన్నై నావలూరు హెచ్సీఎల్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నారు. బుధవారం రాత్రి విధులకు వెళ్లి గురువారం తెల్లవారుజామున ఇంటికి వచ్చే క్రమంలో అటువైపు బైక్పై వెళుతున్న వ్యక్తిని లిఫ్ట్ అడిగారు. అతనితోపాటు మరొకరు బైక్ ఎక్కారు.
వెనుక కూర్చున్న వ్యక్తి ప్రేమ్కుమార్కు మత్తుమందున్న కర్చీఫ్ పెట్టడంతో మత్తులోకి జారుకున్నారు. అక్కడి నుంచి కారులో వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు. గురువారం ఉదయం... ప్రేమ్కుమార్ రూమ్లో ఉంటున్న సందీప్కి, తల్లి అరుణకు కిడ్నాపర్లు ఫోన్ చేసి... కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రేమ్కుమార్ తల్లిదండ్రులు గురువారం సాయంత్రం చెన్నై చేరుకుని కేళంబాక్కం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మరోసారి ఫోన్ చేసిన కిడ్నాపర్లు అరుణను రూ.10 లక్షలు తీసుకుని ఓఎంఆర్ రోడ్డులోని ఓ ప్రదేశానికి రావాలని చెప్పారు.
అరుణ రూ.10 లక్షల నగదుతో రాత్రి సెమ్మంజేరి ప్రాంతానికి వెళ్లగా... ఆమెను పోలీసులు రహస్యంగా వెంబడించారు. అక్కడ హెల్మెట్ ధరించిన యువకుడు అరుణ వద్ద ఉన్న నగదు బ్యాగ్ను లాక్కునేందుకు ప్రయత్నించాడు. అతన్ని పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేశారు. విచారించగా... తయ్యూర్లోని అపార్ట్మెంట్ గదిలో ప్రేమ్కుమార్ను బంధించినట్టు తెలిపాడు. శుక్రవారం వేకువజామున రెండు గంటల సమయంలో ప్రేమ్కుమార్ను పోలీసులు విడిపించారు. దీంతో సంబంధం ఉన్న తయ్యూర్ పెరియమానగర్కు చెందిన పార్తిబన్(23), జయశీలన్(28), కేళంబాక్కం బాలాజీ(27), అరక్కోణం వివేక్ రాజ్(27)ను అరెస్టు చేశారు.
చెన్నైలో తెలంగాణ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిడ్నాప్
Published Sat, Jul 30 2016 12:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement