న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యవహార శైలిని ఆ పార్టీ మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి నట్వర్సింగ్ తాను రాసిన ఆత్మకథ ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్: యాన్ ఆటోబయోగ్రఫీ’లో తూర్పారబట్టారు. సోనియాను నిరంతరం అనుమానించే వ్యక్తి గా, అహంభావిగా అభివర్ణించారు. కఠిన పదజాలంతో దుయ్యట్టారు. తన భర్త రాజీవ్గాంధీ హత్య కేసు విచారణ నత్తనడకన సాగుతోందన్న కోపంతో నాటి ప్రధాని పి.వి. నరసింహారావును దూరం పెట్టారని పేర్కొన్నారు. భారత్లో ఆమె అడుగుపెట్టినప్పటి నుంచీ రాజ వైభోగాన్ని అందుకున్నారన్నారు.
అలాగే సోనియా కుమారుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపైనా, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్పైనా పుస్తకంలో విమర్శలు గుప్పించారు. రాహుల్ మంచివాడైనప్పటికీ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా పనిచేయాలన్న చిత్తశుద్ధి ఆయనలో లేదని విమర్శించారు. పదేళ్లు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ పాలనలో తన ముద్రను వేయలేకపోయారన్నారు. బోఫోర్స్ కుంభకోణం వివాదం, షా బానో కేసు, రామజన్మభూమి అంశాలు, డార్జిలింగ్లో ఆందోళన విషయంలో రాజీవ్ గాంధీ సరిగ్గా వ్యవహరించలేకపోయారన్నారు.
తాను పేర్కొన్న అంశాలపై సోనియామండిపడటంపట్ల నట్వర్సింగ్ శుక్రవారం స్పందిస్తూ పుస్తకంలోని ఏదో విషయంపై కలత చెందడం వల్లే ఆమె అలా ప్రతిస్పందించి ఉండొచ్చన్నారు. నిజాలు రాసినందుకు 50 మంది కాంగ్రెస్ నేతలు తనను అభినందించారని చెప్పారు. గాంధీ కుటుంబం సారథ్యం లేకపోతే కాంగ్రెస్ ఐదు గ్రూపులుగా చీలిపోతుందని నట్వర్ చెప్పారు. పార్టీని సోనియా గత 15 ఏళ్లుగా ఏకతాటిపై నిలుపుతూ వస్తున్నారన్నారు. పుస్తకంలోని అంశాల్లోని నిజానిజాలను తెలిపేందుకు స్వయంగా పుస్తకం రాస్తానంటూ సోనియా పేర్కొనడాన్ని నట్వర్ స్వాగతించారు.
సోనియా అహంభావి!: నట్వర్
Published Sat, Aug 2 2014 5:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement