ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశం | Sakshi
Sakshi News home page

ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశం

Published Sat, Oct 25 2014 1:39 PM

pratyush sinha committee meeting with css of andhra pradesh, telangana

న్యూఢిల్లీ :  ప్రత్యూష్ సిన్హా కమిటీ శనివారమిక్కడ సమావేశమైంది. అఖిల భారత సర్వీసు అధికారులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి సంబంధించి ఈ కమిటీ నిర్వహిస్తున్న ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావు హాజరయ్యారు.

 

ఈ నెల 10న  కమిటీ తాత్కాలిక తుది జాబితాను ప్రకటించడం,  అభ్యంతరాలు తెలపడానికి శనివారం వరకు సమయమివ్వడం తెలిసిందే. ఆ జాబితాలోని 20 మంది ఐఏఎస్‌లు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలని కోరుకుంటూ దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై చర్చించేందుకే సిన్హా కమిటీ సమావేశమైనట్లు తెలుస్తోంది.

 

Advertisement
Advertisement