మోదీ సర్కార్కు మమతా బెనర్జీ సవాల్
కేంద్రం కక్ష సాధిస్తోంది
కోల్కతా: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తనపైనా.. తన పార్టీపైనా కక్ష సాధింపునకు పాల్పడుతోందని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆరోపించారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని, బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి సవాల్ విసిరారు. శారదా కుంభకోణంలో తృణమూల్ ఎంపీ సృంజోయ్ బోస్ అరెస్ట్ నేపథ్యంలో కేంద్రంపై మమత విరుచుకుపడ్డారు. శనివారమిక్కడ జరిగిన పార్టీ సమావేశంలో ఆమె ప్రసంగించారు. బీజేపీకి భయపడాల్సిన పనిలేదని, పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను సమైక్యంగా ఎదుర్కోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు నోరెత్తకూడదని వారు భావిస్తున్నారని, అందుకే సోనియా కూడా నోరు విప్పడం లేదని, తానంటే భయపడుతున్నారని, తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తమపై దాడి జరిగితే ప్రతిఘటిస్తామని, ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ప్రజల కోసమే తాము పని చేస్తామని, రాజకీయ కక్ష సాధింపులపై తమ పోరాటం ఇప్పుడే ప్రారంభమైందన్నారు. సృంజోయ్ అరెస్ట్ను మమత ప్రస్తావిస్తూ.. వాస్తవానికి బీజేపీ తననే లక్ష్యంగా చేసుకుందని, ఢిల్లీలో సెక్యులర్ పార్టీలు ఏర్పాటు చేసిన సదస్సుకు తాను హాజరుకావడమే దీనికి కారణమని ఆరోపించారు. తమ ఎంపీని అరెస్ట్ చేయడం ద్వారా తనపై పగ తీర్చుకున్నారన్నారు. ఇటువంటి వందలు, వేల సదస్సులకు హాజరవుతానని ప్రకటించారు. అల్లర్లకు సంబంధించి అనేక కేసులు ఎదుర్కొంటున్న వారు తమ వైపు ఎలా వేలు చూపిస్తున్నారో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశానికి ఇన్చార్జిగా చెప్పుకుంటున్న వ్యక్తి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఎన్ని రోజులు దేశంలో ఉన్నారని మోదీని ఉద్దేశించి ప్రశ్నించారు. సీబీఐ చీఫ్ రంజిత్సిన్హాను 2జీ కేసు దర్యాప్తు నుంచి తొలగించాలని ఆదేశించాడన్ని ప్రస్తావిస్తూ.. సీబీఐ విశ్వసనీయతను సుప్రీంకోర్టే తప్పుపట్టిందన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలతో చర్చించారు.
దమ్ముంటే రాష్ట్రపతి పాలన పెట్టండి!
Published Sun, Nov 23 2014 12:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement