భారత్–సైప్రస్ నిర్ణయం
- నాలుగు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ.. హింసను ప్రోత్సహించే దేశాలపై కఠినంగా వ్యవహరించాలని భారత్–సైప్రస్ దేశాలు నిర్ణయించాయి. శుక్రవారం ఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ అనస్తాసియేడ్స్ మధ్య ద్వైపాక్షిక అంశాలు, ప్రాంతీయ సమస్యలపై చర్చ జరిగింది. వైమానిక సేవలు, వాణిజ్య, నౌకాయాన సహకారం సహా 4 అంశాలపై వీరి సమక్షంలో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. టర్కీతో సైప్రస్కున్న సరిహద్దు వివాదాల పరిష్కారానికి భారత్ చొరవచూపాలని నికోస్ కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. సైప్రస్ క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు భారత్ వెన్నంటి నిలిచిందన్నారు.
‘ఈ ప్రాంతంలో ఉగ్రవాదులను తయారూచేస్తూ వారికి ఆశ్రయం కల్పిస్తున్న దేశాలపై అన్ని దేశాలు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరంపై మా (భారత్–సైప్రస్) మధ్య అంగీకారం కుదిరింది. భద్రతామండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి సైప్రస్ మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు. భద్రతా మండలిలో సంస్కరణలపైనా చర్చ జరిగింది’ అని మోదీ తెలిపారు. అనంతరం నికోస్తో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సహకారంపై వీరిద్దరూ చర్చించారు. రాజ్ఘాట్లో నివాళులర్పించిన నికోస్ ఆ తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోనూ సమావేశమయ్యారు.
హింసపై ఉక్కుపాదం
Published Sat, Apr 29 2017 3:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement