న్యూఢిల్లీ/ముంబై: కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కారీ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన, ఆయన కుటుంబ సభ్యులు 2013 జూలైలో ఫ్రాన్స్లోని ఎస్సార్ కంపెనీకి చెందిన విలాసవంతమైన నౌకలో రెండు రాత్రులు బస చేశారని శుక్రవారం మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై కాంగ్రెస్ తదితర పార్టీలు విమర్శలు సంధించాయి. సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. అయితే తాను ఏ తప్పూ చేయలేదని గడ్కారీ స్పష్టం చేశారు. తన జీవితంలో ఏ ఒక్క కార్పొరేట్ కంపెనీ నుంచీ డబ్బు తీసుకోలేదన్నారు. ఎస్సార్ గ్రూప్ అంతర్గత సమాచారంగా పేర్కొంటూ ఓ ‘ప్రజావేగు’ గడ్కారీ పర్యటన వివరాలు బహిర్గతం చేయడంతో వివాదం మొదలైంది.
కార్పొరేట్ కంపెనీలు తమ ప్రయోజనాల కోసం అధికారం, పలుకుబడి ఉన్న వారిని ఎలా లోబరచుకుంటున్నాయో ఈ ఉదంతం చెబుతోందని ఆ ప్రజావేగు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్కు చెందిన ఎన్జీఓ సీపీఐఎల్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు, కార్పొరేట్లకు మధ్య సంబంధాలపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందంతో కానీ, సీబీఐతో కానీ దర్యాప్తు జరిపించాలని భూషణ్ సీపీఐఎల్ తరఫున పిటిషన్ వేశారు.
అన్నీ సొంత ఖర్చులే..గడ్కారీ: వివాదం రేగడంతో గడ్కారీ ముంబైలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. ‘పర్యటన నాటికి మంత్రిని కాను, ఎంపీని కాను, ఎమ్మెల్యేను కాను. పర్యటన ఖర్చులన్నీ నా కుటుంబమే పెట్టుకుంది. నేను నార్వే వెళ్తున్న విషయం తెలిసి ఎస్సార్ కంపెనీ వారు ఫ్రాన్స్ తీరంలో తమ విహారనౌకను చూడాలన్నారు. నేను అలాంటిదాన్ని అంతకుముందు చూడలేదు. వారి ఆహ్వానాన్ని అం గీకరించాను. ఫ్రాంక్ఫర్ట్కు టికెట్ తీసుకుని వెళ్లాను. తర్వాత ‘సన్రేస్’ నౌకను సందర్శిం చాను. వాళ్లు రూ. 500 టికెట్ పెట్టినా అందులోకి వెళ్లి ఉండేవాడిని’ అని తెలిపారు.
గడ్కారీ షికారుపై వివాదం
Published Sat, Feb 28 2015 4:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నర్రెడ్డి సునీత, రాజశేఖర్రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు
మేమంతా సీఎం వైఎస్ జగన్ వెంటే
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
సుండుపల్లెలో టీడీపీకి షాక్
సింహ వాహనంపై దేవదేవుడు
టీడీపీ ప్రచారంలో రాష్ట్రీయ సమాజ్ దళ్(ఆర్) అభ్యర్థి
రైతన్నలకు విత్తన రాయితీ
ప్రధాని పదవికి విలువ లేకుండా చేశారు
794 ఫిర్యాదులకు పరిష్కారం
పథకాలు కొనసాగాలంటే జగనన్న రావాలి
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement