మోడరన్ బానిసలు ఎక్కువగా ఉన్నది మన దేశంలోనేనట. దాదాపు కోటి ఎనభై లక్షల మందికి పైగా భారతీయులు కట్టుబానిసలుగాను, బిచ్చగాళ్లుగా, వ్యభిచారులుగా, బాల కార్మికులుగా బతుకీడుస్తున్నారని ఓ అంతర్జాతీయ సర్వేసంస్థ తెలిపింది.
హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ వాక్ ఫ్రీ పౌండేషన్ కు చెందిన ది గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ ఈ విషయాలను బయటపెట్టింది. దాదాపు భారత జనాభాలో 1.4 శాతం బానిసలుగా బతుకుతున్నారని వివరించింది. ఇలా దేశ జనాభాలో బానిసలు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. మొత్తం 167 దేశాల్లో నిర్వహించిన ఈ సర్వేలో ఇండియాలో బానిసత్వం కొనసాగుతోందని తేలినట్లు చెప్పింది. వీటిలో ముఖ్యంగా కట్టుబానిసలు, బాల కార్మికులు, వ్యభిచారులు, భిక్షాటనలో ఉన్నవాళ్లు, బలవంతపు పెళ్లిళ్లు ముందు ముందు కూడా కొనసాగుతాయని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం బానిసల్లో 58 శాతం మంది ఇండియా, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్థాన్ దేశాల లోనే ఉన్నట్లు సంస్థ వెల్లడించింది.
మనుషుల అక్రమ రవాణా, కట్టుబానిసత్వం, వ్యభిచారం, బాలకార్మిక తదితర చట్టాలకు మరింత బలాన్ని చేకూరుస్తూ భారత ప్రభుత్వం కొత్త నియమాలను అమల్లోకి తెచ్చింది. కానీ వీటన్నింటినీ నిర్వహించే గ్యాంగుల జోరు మాత్రం తగ్గడం లేదు. పేద కుటుంబాలకు గాలం వేసి ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు. వీటన్నింటికీ అడ్డుకట్ట వేయాలంటే ప్రైవేటు ఉద్యోగుల కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించుకుని, దాన్ని తరచు పరిశీలించుకోవాలని సర్వే సంస్థ సూచించింది. ఉగ్రవాద సంస్థలకు ఆకర్షితులవుతున్న వారిలో జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఎక్కువగా ఉంటున్నారని హెచ్చరించింది.
దేశంలో 1.80 కోట్ల మంది బానిసలు!
Published Tue, May 31 2016 12:40 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
Advertisement