సెల్ఫీలు సరదా కోసమే కాదు.. ఆత్మరక్షణకు కూడా ఉపయోగపడుతున్నాయి. దుబాయ్లో.. ట్యునీషియాకు చెందిన ఓ మహిళ ఇలాగే సెల్ఫీతో తన మాన ప్రాణాలను కాపాడుకుంది. తన మంచం మీద ఓ వ్యక్తి తాగి పడుకుని ఉన్నట్లు గమనించిన ఆమె.. వెంటనే అతగాడితో కలిసి ఓ సెల్ఫీ దిగి, దాన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్లో పోస్ట్ చేయడంతో పాటు వెంటనే పోలీసులను కూడా అప్రమత్తం చేసింది. ఆమె ఉద్యోగానికి వెళ్లి తిరిగి వచ్చి తన ఫ్లాటు తలుపులు తీసి చూసేసరికి.. గుర్తుతెలియని వ్యక్తి తన మంచం మీద పడుకుని ఉన్నట్లు గమనించింది. కాసేపు షాకైనా.. తర్వాత జాగ్రత్తగా వెళ్లి అతడి సెల్ఫీ తీసింది. వెంటనే పోలీసులకు చెప్పడంతో పాటు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది.
''నేను ఇంటికి వచ్చేసరికి ఓ తాగుబోతు నా పక్కలో పడుకుని ఉన్నాడు. అతడు దొంగిలించేందుకు ప్రయత్నించి.. విఫలమయ్యాడు'' అని కేప్షన్ పెట్టింది. దాంతో ఆ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాపించింది. అయితే, ఆ మహిళ భావించినట్లుగా అతడు దొంగ కాదని, తాగేసి తెలియక వచ్చాడని దుబాయ్ సీఐడీ విభాగం అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహీం అల్ మన్సౌరీ తెలిపారు. ఆ అపార్టుమెంట్ వాచ్మన్ అతడికి స్నేహితుడు కావడంతో వాళ్ల ఇంటికి వచ్చాడని, బాగా తాగడంతో నిద్ర వస్తుంటే ట్యునీషియా మహిళ ఫ్లాటులోకి దూరి ఆమె మంచం మీద పడుకున్నాడని చెప్పారు. మొత్తానికి సదరు తాగుబోతును మాత్రం అనుమతి లేకుండా ఇంట్లో దూరినందుకు అరెస్టు చేసి కేసు పెట్టారు.
తాగి పక్కలో దూరితే.. సెల్ఫీతో పట్టించింది!
Published Wed, May 27 2015 6:57 PM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- ధాన్యం తడవకుండా.. కాపాడే మంచె!
- గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
- శ్రీనగర్: రెండు దశాబ్ధాల ఓటింగ్ రికార్డు బద్దలు!
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- ఆగని టీడీపీ అరాచకాలు
- Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
- గన్నవరంలో టీడీపీ గలాటా
- పోలింగ్ సిబ్బంది ‘పచ్చ’పాతం
- TS: 64.93% పోలింగ్! ప్రశాంతంగా ముగిసిన లోక్సభ ఎన్నికలు
- ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ ఛాన్స్ . అలా జరిగితేనే?
Advertisement