మొత్తం విలువ..33 లక్షల కోట్లు...
- కేజీ బేసిన్లో అపార సిరుల రాశి.. మంచు రూపంలో భారీ గ్యాస్ నిక్షేపాలు
- ఆంధ్రప్రదేశ్ తీరంలో గుర్తింపు.. రిలయన్స్ గ్యాస్ క్షేత్రం కన్నా పది రెట్లు అధికం
వాషింగ్టన్ : కృష్ణా-గోదావరి బేసిన్లో మరోసారి అపార సిరుల రాశి దొరికింది. మంచు రూపంలో నిక్షిప్తమై ఉన్న భారీ సహజవాయువు (గ్యాస్) వనరులను భారతదేశం కనుగొన్నది. శాస్త్రపరిభాషలో ‘గ్యాస్ హైడ్రేట్స్’గా పేర్కొనే ఈ నిక్షేపాలను బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరంలోని కేజీ బేసిన్ పరిధిలో కనుగొన్నారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ సారథ్యంలోని ఈ అన్వేషణలో పాల్గొన్న అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ గ్యాస్ హైడ్రేట్ నిక్షేపాలు అత్యంత సుసంపన్నమైనవని, వీటిని వెలికితీయవచ్చునని తెలిపింది. వీటిలో 134 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్ నిక్షిప్తమై ఉన్నట్లు ప్రాధమిక అంచనాగా ఓఎన్జీసీ వర్గాలు తెలిపాయి.
మొత్తం విలువ ప్రస్తుత ధరల ప్రకారం రూ. 33 లక్షల కోట్లుగా ఉండొచ్చని నిపుణుల అంచనా. ఇదే కేజీ బేసిన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ కనుగొని, నిర్వహిస్తున్న గ్యాస్ క్షేత్రమే ఇప్పటివరకూ భారతదేశం కనుగొన్న అతిపెద్ద గ్యాస్ క్షేత్రం. అందులో 14 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్ ఉన్నట్లు అప్పుడు అంచనా వేశారు. అంటే.. దానికన్నా పది రెట్లు అధికమైన గ్యాస్ నిక్షేపాలను తాజా అన్వేషణలో కనుగొన్నారు. కృష్ణా-గోదావరి బేసిన్లో మందపాటి ఇసుక రిజర్వాయర్లలో ఈ గ్యాస్ హైడ్రేట్ నిల్వలు ఉన్నాయని.. కాబట్టి వీటిని వెలికితీయటం సాధ్యమవుతుందని యూఎస్జీఎస్ ఎనర్జీ రిసోర్సెస్ ప్రోగ్రామ్ సమన్వయకర్త వాల్టర్ గైడ్రోజ్ సోమవారం వాషింగ్టన్లో వెల్లడించారు. పరిశోధన తర్వాతి దశలో ఈ గ్యాస్ హైడ్రేట్లను వెలికితీయటంపై పరీక్షలు నిర్వహించటం జరుగుతందని చెప్పారు.
గ్యాస్ హైడ్రేట్.. మండే మంచు!
సహజవాయువు (నాచురల్ గ్యాస్), నీరు కలిసిపోయి ప్రకృతి సిద్ధంగా గడ్డకట్టి మంచు రూపంలో ఉండటాన్ని గ్యాస్ హైడ్రేట్లుగా పరిగణిస్తారు. ఇవి ప్రపంచంలోని మహాసముద్రాల్లో.. ఖండాల అంచున, ధృవ ప్రాంతాల్లో కనిపిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా గల గ్యాస్ హైడ్రేట్ సంపదలో గల గ్యాస్ పరిమాణం అంతా కలిపితే.. ఇప్పటివరకూ తెలిసిన అన్ని రకాల సంప్రదాయ గ్యాస్ వనరుల పరిమాణం కన్నా చాలా అధికంగా ఉంటుంది. గ్యాస్ హైడ్రేట్ల నుంచి గ్యాస్ను ఉత్పత్తి చేయటం సాధ్యమయ్యేదే అయినప్పటికీ.. ఆ నిక్షేపాలు ఉన్న ప్రాంతం, అవి ఏ రూపంలో ఉన్నాయి అనే అంశాల ఆధారంగా వెలికితీయటానికి చాలా సాంకేతిక సవాళ్లు ఉన్నాయి. అయితే.. ఇసుక రిజర్వాయర్లలో అధిక సాంద్రతల్లో ఉండే గ్యాస్ హైడ్రేట్లను ప్రస్తుతం అందుబాటులో ఉణ్న సాంకేతిక పరిజ్ఞానంతో వెలికితీయటం సాధ్యమేనని ఇంతకుముందలి అధ్యయానాల్లో గుర్తించారు.
భారత్, అమెరికా, జపాన్ల భాగస్వామ్యం
భారతదేశంలో పశ్చిమ, తూర్పు, అండమాన్ సముద్ర తీరాల్లో కలిపి 1,894 ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ హైడ్రేట్ నిక్షేపాలు ఉన్నాయి. దేశంలోని గ్యాస్ హైడ్రేట్స్ సామర్థ్యాలను అన్వేషించటానికి, పైలట్ ఉత్పత్తి పరీక్షల కోసం క్షేత్రాలను గుర్తించటానికి భారత ప్రభుత్వం 2014లో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. జపాన్కు చెందిన జపనీస్ డ్రిల్లింగ్ కంపెనీ, జపాన్ ఏజెన్సీ ఫర్ మెరైన్-ఎర్త్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ సంస్థలు కూడా ఈ అన్వేషణలో భాగస్వాములయ్యాయి. భారత ప్రభుత్వ రంగ సంస్థ చమురు సహజవాయువు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) సారథ్యంలో ‘ఇండియన్ నేషనల్ గ్యాస్ హైడ్రేట్ ప్రోగ్రామ్ ఎక్స్పెడిషన్ 02’ పేరుతో మూడు దేశాల పరిశోధకులు ఈ అన్వేషణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంతకుముందు భారత్, అమెరికాలు ఉమ్మడిగా చేపట్టిన అన్వేషణలో కూడా గ్యాస్ హైడ్రేట్ నిక్షేపాలను కనుగొన్నారు. అయితే.. ఆ గ్యాస్ హైడ్రేట్ ఉన్న రూపాలను బట్టి దానిని ఇప్పుడు వెలికితీయటం సాధ్యంకాదని నిర్ధారించారు. రెండోసారి చేపట్టిన అన్వేషణలో.. ఇసుక రిజర్వాయర్లలో అత్యంత సాంద్రత గల గ్యాస్ హైడ్రేట్లను గుర్తించటంపై కేంద్రీకరించి.. కృష్ణా-గోదావరి బేసిన్లో వెలికితీయగల నిక్షేపాలను కనుగొన్నారు.
ప్రపంచంలో అతి భారీ నిక్షేపాల్లో ఒకటి
కృష్ణా-గోదావరి బేసిన్లోని 982, డి3, డి6, డి9 బ్లాకుల్లో ఈ గ్యాస్ హైడ్రేట్స్ నిక్షేపాలను గుర్తించినట్లు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ వర్గాలు తెలిపాయి. ఇవి రిలయన్స్ గ్యాస్ క్షేత్రమైన కేజీ-డి6 బ్లాక్కు 30 కిలోమీటర్లు నైరుతిగా ఉన్నాయి. కేజీ బేసిన్లో రిలయన్స్ గ్యాస్ ఇండస్ట్రీస్ 2002లో కనుగొన్న అతి భారీ గ్యాస్ క్షేత్రంలో ఉన్నట్లు పేర్కొన్న గ్యాస్ కన్నా.. తాజాగా ఇదే కేజీ బేసిన్లో కనుగొన్న గ్యాస్ హైడ్రేట్లు పది రెట్లు అధికంగా 134 లక్షల కోట్ల ఘనపుటడుగల మేర ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు. రిలయన్స్ గ్యాస్ క్షేత్రంలో 14 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్ ఉన్నట్లు అంచనా వేశారు. రిలయన్స్ సంస్థకు ప్రభుత్వం 1 ఎంబీటీయూ (మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్) గ్యాస్కు 3.7 డాలర్లు చొప్పున ధర నిర్ణయించింది. అదే ధర ప్రకారం ఈ గ్యాస్ హైడ్రేట్లలోని 134 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్ విలువ దాదాపు రూ. 33 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ప్రపంచంలో ఇప్పటివరకూ గుర్తించిన అతి పెద్ద, అత్యంత సాంద్రతతో కూడిన గ్యాస్ హైడ్రేట్ నిక్షేపాల్లో ఇది ఒకటని.. ప్రపంచ ఇంధన వనరుల సామర్థ్యానికి గల పరిమితులను తొలగించటానికి, వాటిని సురక్షితంగా ఉత్పత్తి చేసే పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ఈ ఆవిష్కారం దోహదం చేస్తుందని యూఎస్జీసీ సీనియర్ శాస్త్రవేత్త టిమ్ కొలెట్ పేర్కొన్నారు.
సహజ వాయువుల మహా ఖజానా.. ఆంధ్ర తీరం
Published Wed, Jul 27 2016 12:59 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement