ఉగ్రవాదులకు నిధులపై భారత్ ఆందోళన | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదులకు నిధులపై భారత్ ఆందోళన

Published Sun, Dec 21 2014 5:32 AM

India's concern that terrorists funds

న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించినప్పటికీ లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు నిధులు అందుతుండడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. వారికి నిధులు అందకుండా చర్యలు తీసుకోవాలంటూ పిలుపునివ్వాలని ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి భగవత్ బిష్ణోయ్ కోరారు. ఉగ్రవాదంపై సమితిలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా తదితర  మార్గాల్లో సమకూరిన నిధులు ఉగ్రవాదులకు చేరుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
 

Advertisement
Advertisement