ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి | Ts Cm Kcr, Ap Cm Babu, Governor wish people on ramzan | Sakshi
Sakshi News home page

ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి

Published Mon, Jun 26 2017 2:07 AM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

Ts Cm Kcr, Ap Cm Babu, Governor wish people on ramzan

► రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం, ఏపీ సీఎం

హైదరాబాద్‌: ముస్లిం సోదరులు పవిత్రమైన రంజాన్‌ (ఈద్‌–ఉల్‌– ఫితర్‌) పండుగను సోమవారం జరు పుకోనున్నారు. ఆదివారం రాత్రి నెల వంక దర్శనమిచ్చినట్లు హైదరాబాద్‌ రూహియత్‌–ఏ–హిలాల్‌ కమిటీ అధ్యక్షుడు మౌలానా ఖుబూల్‌ పాషా సుత్తారి ప్రకటించారు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముస్లిం సోదరులు సోమవారం ఈద్‌–ఉల్‌–ఫితర్‌ పండుగను జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో రంజాన్‌ మాసం దీక్షలు ముగిసినట్లయింది.

రంజాన్‌ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌.నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఏపీ సీఎం చంద్ర బాబు, ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ పర్వదినాన్ని ఆనందోత్సాహలతో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement