మర్రి చెన్నారెడ్డికి ఘన నివాళి | Sakshi
Sakshi News home page

మర్రి చెన్నారెడ్డికి ఘన నివాళి

Published Fri, Dec 2 2016 11:47 AM

tributes to former cm marri chenna reddy over Memorial

హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి వర్థంతిని పురస్కరించుకుని శుక్రవారం పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఇందిరాపార్కులో ఉన్న చెన్నారెడ్డి రాక్ గార్డెన్‌లో ఆయన సమాధికి స్పీకర్ మధుసూదనాచారి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, పలువురు కాంగ్రెస్ నేతలు శ్రద్ధాంజలి ఘటించిన వారిలో ఉ‍న్నారు.

Advertisement
Advertisement