► ప్రజలకిచ్చిన వాగ్దానాలన్నీ ప్రభుత్వం నిలబెట్టుకుంది: సీఎం కేసీఆర్
► ప్రజలకు చెప్పినవన్నీ చేసి చూపిద్దాం
సాక్షి, హైదరాబాద్: నిర్ణీత గడువు పెట్టుకుని నిబద్ధతతో పని చేస్తే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు పాలన చేరువైందని, ఇప్పటివరకు చేసిన పనులే కాదు.. చెప్పినవన్నీ చేసి చూపిద్దామని వ్యాఖ్యానించారు. గడిచిన రెండున్నరేళ్లలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ ప్రభుత్వం నిలబెట్టుకుందంటూ సంతృప్తిని వ్యక్తం చేశారు. గురువారం క్యాంపు కార్యాలయంలో పోచమ్మ ఆలయం పునఃప్రతిష్ట అనంతరం ముఖ్యమంత్రి సీఎంవో అధికారులు, కొందరు ప్రజాప్రతినిధులతో ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా పని చేయటంలో అధికారులు సంపూర్ణ సహకారాలు అందిస్తున్నారని ప్రశంసించారు. ‘‘అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో విమర్శలు. ఎన్నో అవహేళనలు. ఈ ప్రభుత్వం చెప్పిన పనులేవీ చేయదని, ఉత్తి మాటలతో కాలం గడుపుతుందని కొందరు ఎగతాళి చేశారు.
కొత్త జిల్లాలు కానే కావు. కొత్త డివిజన్లు, మండలాలు రావు. ఇంటింటికీ తాగునీరు రానే రాదు. చెరువుల కార్యక్రమం సాగేది కాదు.. ఇలాంటి విమర్శలెన్నో వచ్చాయి. ఇవన్నీ అధిగమించాం. అనుకున్నది చేస్తాం. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామనే భరోసాను ప్రజలకు కల్పించాం. ఇప్పుడు కొత్త జిల్లాలు కొలువు దీరాయి. కలెక్టరేట్లు, కలెక్టర్లు, ఎస్పీలందరితో కొత్త జిల్లాలు కళకళలాడుతున్నాయి. గతంలో ఎన్నడూ ఊహించని విధంగా జిల్లా ఆఫీసులు ప్రజల చెంతకు చేరాయి. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు పరిపాలన అత్యంత చేరువైంది’’ అని సీఎం అన్నారు. ‘‘దసరాకు కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేయాలని పదేపదే నిర్ణీత గడువు లక్ష్యంగా పని చేయటంతోనే ఇది సాధ్యమైంది.
దసరా రోజున చేయాలని ముందునుంచి అనుకోకుంటే ఇప్పట్లో అయ్యేది కాదు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందించే పథకాన్ని సైతం ఇదే నిర్ణీత గడువుతో చేపట్టాం. అందుకే మొదటి దశ విజయవంతంగా పూర్తి చేశాం. అదే స్ఫూర్తితో అన్ని గ్రామాలకు తాగునీటిని అందించి చూపిద్దాం. ఇప్పటివరకు చేసిన పనులే కాదు.. చెప్పినవన్నీ చేసి చూపిద్దాం. అందరం కలిసి పని చేద్దాం. కొత్త సెక్రటేరియట్, కళాభారతి, హుస్సేన్సాగర్ శుద్ధి, విశ్వనగరంగా హైదరాబాద్ అభివృద్ధి.. అన్నింటినీ ఒకదాని వెంట ఒకటి పూర్తి చేద్దాం. అప్పుడే ప్రజల నుంచి ఆశించినంత ఆదరణ వస్తుంది’’ అని సీఎం అధికారులతో తన మనోభావాలను పంచుకున్నారు.
అయామ్ సో హ్యాపీ!
Published Fri, Oct 21 2016 2:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైట్హౌస్కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి
టీడీపీ కార్యకర్తల దాడి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
తప్పక చదవండి
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement