ఆపరేషన్ ‘ఎడ్యుకేషన్’ | Sakshi
Sakshi News home page

ఆపరేషన్ ‘ఎడ్యుకేషన్’

Published Wed, Sep 24 2014 1:28 AM

Operation 'Education'

సాక్షి, సిటీబ్యూరో/దోమలగూడ: అక్టోబర్ 5న దాన్ ఉత్సవ్‌లో భాగంగా యూనిక్వీ బ్లాక్ టై చారిటీ డిన్నర్ ‘ఫుడ్ ఫర్ చేంజ్’ను జేఆర్‌సీ కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ రౌండ్ టేబుల్ (హెచ్‌ఆర్‌టీ)-8 సభ్యుడు అనూప్ రావు తెలిపారు. మంగళవారం మారియట్ హోటల్‌లో ఈవెంట్ వివరాలను ఆయన తెలిపారు. ఈవెంట్‌కు అంబాసిడర్‌లుగా ఉన్న బ్యాడ్మింటన్ మాజీ ప్లేయర్ గోపీచంద్, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, సినీ నటి సమం త కార్యక్రమానికి హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు ఇచ్చే నగదును సర్కారీ పాఠశాల విద్యార్థుల ఉన్నతికి వెచ్చిస్తామన్నారు. సినీ నిర్మాత డి.సురేశ్‌బాబు మాట్లాడుతూ ప్రముఖుల సహకారంతో సర్కారీ బ డుల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు    కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యను కార్పొరేట్ పాఠశాలల దీటుగా ఉండేలా కృషి చేసేందుకు ఆవిర్భవించిన ‘ప్రాజెక్ట్ 511’కు ఈ నిధులు అందచేస్తామన్నారు.

Advertisement
Advertisement