సినీనటి మెడలో గొలుసు లాక్కెళ్లారు! | Sakshi
Sakshi News home page

సినీనటి మెడలో గొలుసు చోరీ

Published Wed, Oct 1 2014 8:21 PM

శ్రీలక్ష్మి

హైదరాబాద్: సినీ హాస్యనటి శ్రీలక్ష్మి మెడలోని బంగారు గొలుసును ఇద్దరు దుండగులు లాక్కొని పారిపోయారు.  యూసఫ్గూడలో నివాసం ఉంటున్న శ్రీలక్ష్మి సమీపంలోని షాపుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ చోరీ జరిగింది.

ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలోని గొలుసు లాక్కొని వెళ్లిపోయారు. శ్రీలక్ష్మి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
**

Advertisement
Advertisement