క్యాటో సమన్వయ భేటీలో డీజీపీల నిర్ణయం
సాక్షి, హైదరాబాద్/భోగాపురం: మావోయిస్టులను అణచివేసేందుకు అభివృద్ధి అస్త్రాన్ని ప్రయోగించాలని క్యాటో సమావేశం నిర్ణయిం చింది. మెరుగైన వైద్య సదుపాయాలు, నాణ్యమైన విద్య అందించడం, ఉపాధి కల్పించడం, రవాణా, సమాచార వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా గిరిజనుల జీవన ప్రమాణాలను పెంచడానికి ప్రణాళిక రూపొంచింది. మావోయిస్టులకు గిరిజనులు సహాయ నిరాకరణ చేసేలా చర్యలు తీసుకుంటే.. నక్సలిజాన్ని కూకటివేళ్లతో పెకలించి వేయవచ్చునని తీర్మానించింది. విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని సన్రే విలేజ్ రిసార్ట్స్లో శుక్రవారం ‘క్యాటో’(చత్తీస్గఢ్, ఏపీ, తెలంగాణ, ఒడిశా) సమన్వయ సమావేశం ప్రారంభమైంది.
రెండు రోజుల ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ, ఒడిశా డీజీపీలు జేవీ రాముడు, అనురాగ్ శర్మ, కేబీ సింగ్, ఛత్తీస్గఢ్ అదనపు డీజీపీ టీజే లాంగ్ కుమేర్, ఆయా రాష్ట్రాల నిఘా అధికారులు, సీఆర్పీఎఫ్ డెరైక్టర్ జనరల్, బీఎస్ఎఫ్, కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారులు, మెరైన్ పోలీసు విభాగం అధికారులు పాల్గొన్నారు. నాలుగు రాష్ట్రాల సరిహద్దులోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోరాపుట్, మల్కన్గిరి తదితర జిల్లాల ఎస్పీలు, డీఐజీలు, ఐజీలు పాల్గొన్నారు.
దేశ అంతర్గత భద్రతను పరిరక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై రెండు రోజులపాటు సాగే క్యాటో సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చత్తీస్గఢ్, ఏపీ, తెలంగాణ, ఒడిశా సరిహద్దులో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో రహదారి, సమాచార వ్యవస్థను అభివృద్ధి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఎవరిపై ఆధారపడకుండా జీవించే వాతావరణాన్ని గిరిజనులకు కల్పిస్తే నక్సల్స్కు వారు సహకరించే పరిస్థితి ఉండదని సమావేశం అభిప్రాయపడింది. నాలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య సమన్వయం, సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా నక్సల్స్తోపాటు మాదక ద్రవ్యాల స్మగ్లర్లు వంటి సంఘ విద్రోహక శక్తులను నియంత్రించవచ్చని సమావేశం అభిప్రాయపడింది.
నక్సలిజంపై అభివృద్ధి అస్త్రం
Published Sat, Apr 30 2016 2:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement