చంద్రబాబు ఈ దేశ రాజకీయాలకు పట్టిన చెద అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. చంద్రబాబు అవినీతిని చూసి దేశమంతా నివ్వెరపోతోందని ఆమె అన్నారు. హైదరాబాద్లోని లోటస్పాండ్లో గల పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ తండ్రీకొడుకులు ఎలా దోచుకుంటున్నారో, రెండేళ్లలోనే రూ. 1.34 లక్షల కోట్లకు పైగా ఎలా అవినీతికి పాల్పడ్డారో పుస్తక రూపంలో ప్రచురించి తమ నాయకుడు ఢిల్లీ పెద్దలందరికీ అందించారని చెప్పారు. అన్నిపార్టీల వాళ్లు దీనిపై చర్చ ప్రారంభించారని, చంద్రబాబు అవినీతి, అక్రమాలు, నీతిమాలిన రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయారని అన్నారు. అందుకే టీడీపీ మంత్రులు, నాయకులు కల్లు తాగిన కోతుల్లా అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటున్నారని మండిపడ్డారు. లోకేష్ మాటిమాటికీ దమ్ముంటే చర్చకు రా అంటాడని, ఇలాగే కేసీఆర్ మీద కూడా దమ్ముంటే అంటూ తొడగొడితే ఏమైందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. అవినీతిపై చంద్రబాబు సిటింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణకు సిద్ధం కావాలని సవాలుచేశారు. దీనిపై అసెంబ్లీలో అయినా తీర్మానం చేయండి లేదా కేంద్రానికి లేఖ రాయండని ఆమె అన్నారు. వైఎస్ జగన్ ఎప్పుడూ తప్పు చేయలేదని, చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో జతకలిసి జగన్ను జైలుకు పంపారని రోజా చెప్పారు. వైఎస్ జగన్ ఈరోజుకు కూడా ధైర్యంగా కేసులు ఎదుర్కొంటుంటే.. చంద్రబాబు మాత్రం చీకట్లో చిదంబరాన్ని కలిసి విచారణ జరగకుండా చూసుకున్నారని విమర్శించారు.
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో చంద్రబాబు రెడ్హ్యాండెడ్గా దొరికిపోయారని, ఆ టేపుల్లోని గొంతు చంద్రబాబుదేనని ల్యాబ్లు కూడా నిర్ధారించాయని రోజా చెప్పారు. రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిన బాబు.. ఏపీని అవినీతి నిలయంగా మార్చారని, ఆ తర్వాత మోదీ, పవన్ కల్యాణ్ల కాళ్లు పట్టుకుని అధికారంలోకి వచ్చారని అన్నారు. వైఎజ్ జగన్ మాత్రం ధైర్యంగా నిలబడి ఒంటరి పోరాటం చేశారన్నారు. ఏపీకి దేశ విదేశాల్లో చెడ్డపేరు తెచ్చింది చంద్రబాబేనని మండిపడ్డారు. కల్తీమద్యం, కాల్మనీ సెక్స్ రాకెట్లను ఆయనే ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రాజధాని పేరుతో బాబు అనుచరులు పేదలు, దళితుల పొట్టకొడుతున్నారన్నారు.
వైఎస్ పేరు చెబితే 108, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తాయని, అదే బాబు పేరు చెబితే కమీషన్లు, ముడుపులు, మాఫియాలే గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో అవినీతికి పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఘనత చంద్రబాబుదేనని ఆమె అన్నారు. ఇప్పటికైనా బాబు ఎమ్మెల్యేల కొనుగోళ్లు ఆపి లక్ష కోట్ల సంపదను పేదలకు పంచిపెట్టాలని ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. అంతర్గత ప్రజాస్వామ్యం లోపించింది వైఎస్ఆర్సీపీలో కాదని, టీడీపీలోనేనని ఆమె అన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ మీద చెప్పులు విసిరింది చంద్రబాబు అండ్ కోనే అని గుర్తు చేశారు. తాను అవినీతికి పాల్పడలేదన్న విషయమై చంద్రబాబు కాణిపాకంలో ప్రమాణం చేయగలరా అని సవాలు చేశారు.
రాజకీయాలకు పట్టిన చెద ఆయనే
Published Thu, Apr 28 2016 12:56 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement