* సమగ్ర కుటుంబ సర్వేలో వెల్లడి కుటుంబాల సంఖ్య 1,05,82,000
జిరాక్స్ ఫార్మాట్లపై మరో నాలుగు లక్షల కుటుంబాల వివరాలు
వీటిని పక్కన పెట్టిన అధికారులు.. విచారణ తరువాత చేర్చే అవకాశం
వారిని కూడా కలిపితే.. 3.73 కోట్లకు జనాభా
మరో ఆరు లక్షల ఇళ్లకు తాళాలున్నట్లు సర్వేలో నమోదు
హైదరాబాద్లో సర్వే జరగని కుటుంబాలు లక్షన్నర పైనే!
76 శాతం మందికి మాత్రమే ఆధార్కార్డుతో అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జనాభా 3.61 కోట్లుగా తేలింది. మొత్తం కుటుంబాల సంఖ్య కోటీ 5 లక్షల 82 వేలుగా వెల్లడైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘సమగ్ర ఇంటింటి సర్వే’లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యా యి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు మాత్రమే అందించేందుకు, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘సమగ్ర కుటుంబ సర్వే’ను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో సేకరించే సమాచారం ఆధారంగా ఒక స్పష్టమైన డాటాబేస్ ప్రభుత్వ శాఖలకు అందుబాటులోకి వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
కుటుంబాలను సర్వే చేసి, సర్వే పత్రాలను జిల్లాల్లోనూ, హైదరాబాద్లోనూ యుద్ధ ప్రతిపాదికన కంప్యూటర్లలో నమోదు చేసే ప్రక్రియను చేపట్టారు. ఇందుకోసం దాదాపు 23 వేల కంప్యూటర్లను వినియోగించగా.. కంప్యూటరీకరణ పూర్తికావడానికి 20 రోజులు పట్టింది. ఈ సమాచారంలో నుంచి అవసరమైన వివరాలను తీసుకోవడానికి వీలుగా ఒక సాఫ్ట్వేర్ను కూడా తయారు చేశా రు. రాష్ట్రంలోని కుటుంబాల సంఖ్య 1.05 కోట్ల కు పైగా ఉండడంతో.. జనాభా నాలుగు కోట్లు దాటుతుందని తొలుత అంచనా వేసినా... జనాభా 3.61 కోట్లుగా వెల్లడైనట్లు తెలుస్తోంది.
ఇంకా తేలాల్సి ఉంది!
సర్వే వివరాలను నమోదు చేసిన తరువాత దాదాపు ఆరు లక్షల ఇళ్లకు తాళాలు ఉన్నట్లు వెల్లడైంది. ఈ ఆరు లక్షల ఇళ్లల్లోని కుటుంబ సభ్యులు వలస వెళ్లారా? లేక సర్వే కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లారా? ఇతర రాష్ట్రాల్లో ఉన్నారా? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు సర్వే కోసం కోటీ ఇరవై లక్షల వరకు పత్రాలను సిద్ధం చేసినా... పంపిణీలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల కుటుంబాల వివరాలను జిరాక్స్ కాపీలపై నమోదు చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అన్న అంశంపై అధికార యంత్రాంగం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నట్లు సమాచారం. ఈ నాలుగు లక్షల కుటుంబాల వివరాలను కూడా కలుపుకొంటే.. జనాభా 3.73 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. కాగా 2011 జనాభా లెక్కల్లో తేలినట్లుగానే.. ఎస్సీ, ఎస్టీల జనాభా శాతం ఉన్నట్లు అధికారవర్గాలు వివరించాయి.
2.74 కోట్ల మందికి ఆధార్..
తెలంగాణ జనాభా 3.61 కోట్లు కాగా.. అందులో ఆధార్కార్డు ఉన్న వారి సంఖ్య 2.74 కోట్లుగా తేలింది. దాదాపు మరో 90 లక్షల మందికి ఆధార్కార్డు లేదు. వీరందరికీ ఆధార్కార్డులు ఎలా ఇస్తారన్న విషయంలోనూ ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. సర్వే సమయంలో మాత్రం ఆధార్కార్డు లేని వారికోసం మండల కేంద్రాల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తామని.. వాటిద్వారా ఆధార్కార్డు అందగానే ఆ నంబర్ను సర్వే వివరాలకు అనుసంధానం చేస్తామని అధికారులు చెప్పారు.
రాజధానిలో పూర్తికాని సర్వే..
రాజధాని హైదరాబాద్లో దాదాపు లక్షన్నర కుటుంబాల సర్వే ఇప్పటికీ పూర్తికాలేదు. సర్వే చేయని కుటుంబాలపై ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటన నుంచి వచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటారని అప్పట్లో అధికారులు చెప్పినా.. ఆ తరువాత దీనికి సంబంధించి ఎలాంటి ఆదేశాలూ రాలేదు.
తెలంగాణ జనాభా 3.61 కోట్లు!
Published Fri, Sep 19 2014 1:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
తప్పక చదవండి
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement