అరగంటపాటు నిలిచిపోయిన జన్మభూమి ఎక్స్ ప్రెస్ | Sakshi
Sakshi News home page

అరగంటపాటు నిలిచిపోయిన జన్మభూమి ఎక్స్ ప్రెస్

Published Mon, Feb 8 2016 8:45 PM

janmabhumi express stopped at damaracharla due to coiled with buffelows on track

దామరచర్ల(నల్లగొండ): సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళోతన్న జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలు సోమవారం సాయంత్రం నల్లగొండ జిల్లా దామరచర్లలో అర్ధాంతరంగా నిలిచిపోయింది.

 

బొత్తల పాలెం వద్ద పట్టాలపై ఉన్న రెండు గేదెలను రైలు ఢీకొట్టిన అనంతరం డ్రైవర్ రైలును నిలిపేశాడు. చనిపోయిన గేదెల శరీరభాగాలు రైలు చక్రాల్లో ఇరుక్కుపోవడంతో రైలును అనివార్యంగా నలిపేశారు, వీటిని తొలగించిన అనంతరం తిరిగి రైలు గుంటూరుకు బయలుదేరింది.

Advertisement
Advertisement