సాక్షి, విజయవాడ బ్యూరో: సమస్యలపై వినతులు ఇచ్చేందుకు వచ్చిన మహిళా సంఘాల నేతలపై చంద్రబాబు పరుష పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏయ్ ఎక్కువ మాట్లాడుతున్నావేంటి’ అంటూ తీవ్ర అసహనం ప్రదర్శించారు. దీనిపై వారు అభ్యంతరం తెలపడంతో క్షమాపణలు చెప్పారు. డ్వాక్రా రుణాల మాఫీపై చర్చించేందుకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వామపక్ష మహిళా సంఘం రాష్ట్ర సదస్సు జరిగింది. సదస్సు తర్వాత మహిళలంతా ర్యాలీగా సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారించి సీఎం వద్దకు 10 మందిని అనుమతించారు.
డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయలేదని, దీనివల్ల వారు ఇబ్బంది పడుతున్నారని ప్రగతి శీల మహిళా సంఘం నేత ఎం.లక్ష్మి చెప్పగా సీఎం అసహనం వ్యక్తం చేశారు. వాళ్ల జేబులో వేసుకోవడానికి ఎంతంటే అంత డబ్బులు ఇవ్వలేమని, ఉపాధి కోసమే డబ్బు ఇస్తామని చెప్పారు. ఇతర నేతలు ఇసుక ర్యాంపుల్లో మహిళలకు 25 శాతం వాటా రావాల్సివున్నా రావడంలేదని, రూ.150 కూలి మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. దీంతో సీఎం వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఏయ్ ఎక్కువమాట్లాడుతున్నావేంటి.. నువ్వు నాకు చెప్పాలా’ అని లక్ష్మిపై విరుచుకుపడ్డారు. మిగిలిన నేతలు అభ్యంతరం చెప్పడంతో... సీఎం క్షమాణలు చెప్పారు.
అనంతరం గుడి, బడి తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ బెల్టు షాపులు పెడుతున్నారని, దీనివల్ల మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లగా... ఎక్కడున్నాయో చూపించాలని గద్దించారు. రామకృష్ణాపురం బుడమేరు వంతెన దగ్గరే బెల్టుషాపు ఉందని దీంతో ఏపీ మహిళా సమాఖ్య నేత చెప్పగా... దాని సంగతి చూస్తానంటూ వెళ్లిపోయారు. తాము మాట్లాడుతుండగానే సీఎం వెళ్లిపోవడంపై మహిళా సంఘ నేతలు ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు బయటకు పంపించివేశారు. ప్రగతిశీల మహిళా సంఘం నేత లక్ష్మి మాట్లాడుతూ... ఇలాంటి సీఎంను ఎప్పుడూచూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏయ్.. ఎక్కువ మాట్లాడుతున్నావేంటి?!
Published Sat, Aug 1 2015 3:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement