మచిలీపట్నంలో బాబును నిలదీసిన టీడీపీ నాయకుడి భార్య
మచిలీపట్నం: ‘‘చంద్రబాబూ... టికెట్లు అమ్ముకుంటున్నారు. ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడినవారికి టికెట్ ఇవ్వరా? ఇదేమి న్యాయం...’’ అంటూ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ మహిళ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని నిలదీశారు. ఆమె ఎవరో కాదు... కైకలూరు నియోజకవర్గానికి చెందిన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చలమలశెట్టి రామానుజయ భార్య. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మచిలీపట్నం వచ్చిన చంద్రబాబు కాన్వాయ్ని ఆమె అడ్డుకున్నారు. టికెట్లు అమ్ముకుంటున్నారంటూ శాపనార్థాలు పెట్టారు. వేరేవారికి కైకలూరు టికెట్ కేటాయించటంపై రామానుజయ అనుయాయులు చంద్రబాబు కాన్వాయ్ని అడ్డుకుని నిరసన తెలిపారు. కైకలూరు సీటును రామానుజయకే ఇవ్వాలని నినాదాలు చేశారు.
పోలీసులు రంగంలోకి దిగి వారిని అడ్డుతొలగించారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11.30 గంటలకు రావాల్సిన చంద్రబాబు సాయంత్రం 5.30 గంటలకు చేరుకోవటంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసహనం వ్యక్తమైంది. కృష్ణా జిల్లాలోని పెడన, మచిలీపట్నం, పామర్రుల్లో ఏర్పాటు చేసిన సభల్లో చంద్రబాబు మాట్లాడారు. ఎప్పటిలాగే అమలు కాని హామీలపైనే ఆయన రొటీన్గా ప్రసంగించడంతో సభకు హాజరైనవారిలో పెద్దగా స్పందన కనిపించలేదు. బీజేపీతో ఎన్నికల పొత్తు కారణంగా ఇబ్బందులు వచ్చాయని, వాటిని అధిగమించేందుకు అవస్థలు పడాల్సి వచ్చిందని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తు కారణంగా తలెత్తిన ఇబ్బందులను పరిష్కరించే ప్రయత్నం కారణంగా తన పర్యటన ఆలస్యమైందన్నారు. దేశ ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ముస్లింలు, మైనార్టీలకు ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు. రాష్ట్ర విభజనతో 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ కనుమరుగువుతోందని జోస్యం చెప్పారు. సీమాంధ్ర ప్రజలంతా తలా కాస్తా తట్ట మట్టి, సిమెంటు వేసి దాన్ని పూర్తిగా సమాధి చేయాలన్నారు.
మన్మోహన్సింగ్ ప్రధానిలా కాక సోనియా చేతిలో రోబో మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ సమర్థుడైన యువకుడు కాదని, అతనికి దేశాన్ని పాలించే సీన్ లేదని వ్యాఖ్యానించారు. మనమంతా కష్టాల్లో ఉన్నామని, ఇటువంటి సమయంలో విజన్ ఉన్న తన లాంటి నాయకుడ్ని ఎన్నుకోవాలని చెప్పారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, బందరు, పెడన టీడీపీ అభ్యర్థులు కొల్లు రవీంద్ర, కాగిత వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
టికెట్లు అమ్ముకుంటున్నారు
Published Sat, Apr 19 2014 1:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement