మిర్యాలగూడ, న్యూస్లైన్ : రబీ ధాన్యానికి మద్దతు ధర రావడం లేదు. మిల్లర్లు సిండికేట్గా మారి ఇష్టం వచ్చిన ధరకు కొనుగోలు చేస్తుండడంతో ఆరుగాలం కష్టించి పండించిన రైతులు లబోదిబోమంటున్నారు. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా ధాన్యం తేమగా ఉందనే సాకుతో మద్దతు ధర చెల్లించడం లేదంటే మిల్లర్ల తీరు ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. మిషన్ల ద్వారా తేమశాతం పరిశీలిస్తున్నా రైతులకు శాతం వివరాలు తెలియజేయకపోవడంతోపాటు వారి ఎదుట శాతం పరిశీలించడం లేదు. దీనిని మార్కెట్ అధికారులు ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.
మిర్యాలగూడ మండలంలోని అవంతీపురం వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తీసుకువచ్చినా టెండర్లు వేయకపోవడంతో రైతులు రెండు, మూడు రోజులు మార్కెట్లోనే పడిగాపులు పడుతున్నారు. అవంతీపురం వ్యవసాయ మార్కెట్లోకి రైతులు ఈ నెల 11వ తేదీ నుంచి ధాన్యం తీసుకువస్తున్నారు. ఇప్పటి వరకు 46,926 క్వింటాళ్ల ఎంటీయూ- 1010 రకం ధాన్యం మార్కెట్కు వచ్చింది. మార్కెట్ ప్రారంభమైన మొదటి రోజు క్వింటాకు వెయ్యి రూపాయలే చెల్లించిన మిల్లర్లు ప్రస్తుతం 1200 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఏ గ్రేడ్ ధాన్యానికి మద్దతు ధర క్వింటాకు రూ.1345, సాధారణ రకం ధాన్యానికి క్వింటాకు 1310 రూపాయలు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం మొత్తం ఏ గ్రేడ్ ధాన్యం వస్తున్నది. దీంతో ఈ ధాన్యానికి క్వింటాకు రూ.1200లు చెల్లిస్తున్నారు.
1861 క్వింటాళ్లకే మద్దతు ధర
రబీ సీజన్లో మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు కేవలం 1861 క్వింటాళ్ల ధాన్యానికి మాత్రమే మద్దతు ధర లభించింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 46,926 క్వింటాళ్ల ధాన్యం మార్కెట్కు రాగా ఎక్కువ శాతం మద్దతు ధర కంటే తక్కువకే కొనుగోళ్లు చేశారు. 11వ తేదీన సగటు ధర క్వింటాకు రూ.1276 చెల్లించగా మిగతా రోజుల్లో క్వింటాకు సగటు ధర కేవలం రూ.1270 చెల్లించారు. శనివారం కేవలం 2.57 శాతం ధాన్యానికి మద్దతు ధర చెల్లించారు.
మార్కెట్కు 15,127 క్వింటాళ్ల ధాన్యం రాగా కనిష్ట ధర రూ.1200, గరిష్ట ధర రూ.1345, సగటు ధర రూ.1270 చెల్లించారు. 3794 క్వింటాళ్ల ధాన్యానికి కేవలం రూ.1151 నుంచి రూ.1200 లోపు చెల్లించారు. 4609 క్వింటాళ్ల ధాన్యానికి రూ.1201 నుంచి రూ.1240 లోపు, 4109 క్వింటాళ్ల ధాన్యానికి రూ.1241 నుంచి రూ.1280 లోపు చెల్లించారు. 2226 క్వింటాళ్లకు రూ.1281 నుంచి రూ.1344 లోపు చెల్లించారు. కేవలం 389 క్వింటాళ్ల ధాన్యానికి మాత్రమే రూ.1345 మద్దతు ధర చెల్లించారు.
మద్దతు..ఉత్తదే!
Published Sun, Apr 20 2014 3:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement