బైక్‌ను ఢీకొన్న నాందేడ్‌-తిరుపతి ఎక్స్‌ప్రెస్ | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న నాందేడ్‌-తిరుపతి ఎక్స్‌ప్రెస్

Published Wed, May 10 2017 7:44 AM

train hits a bike on railway track

నిజామాబాద్‌: నాందేడ్‌-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైలు మంగళవారం రాత్రి పట్టాలు తప్పింది. నాందేడ్‌ నుంచి నిజామాబాద్‌కు వస్తుండగా ముద్‌ఖేడ్‌ సమీపంలోని శివాన్‌గావ్‌ వద్ద పట్టాలపై నిలిపి ఉన్న ఓ బైకును ఢీకొట్టింది. దీంతో రైలు ముందుభాగం చక్రాలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. అదే సమయంలో రైలు ఇంజిన్‌లో స్వల్పంగా మంటలు వచ్చాయి. ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రయాణికులు నుంచి సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనాస్థలానికి వెళ్లారు. దాదాపు గంటపాటు యత్నించిన అధికారులు రైలును పట్టాలెక్కేలా చేశారు. గంటపాటు ఈ దారిలో వెళ్లే రైళ్లను అధికారులు దారి మళ్లించారు. ఎవరైనా కావాలనే ద్విచక్ర వాహనాన్ని పట్టాలపై నిలిపారా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
Advertisement