⇒సింహాద్రి హత్య కేసులో ముగ్గు్గరిని అరెస్ట్ చేసిన ద్వారకా పోలీసులు
⇒ఇద్దరితో రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న మృతుని బావవివరాలు వెల్లడించిన ఏసీపీ
⇒రామచంద్రరావు, సీఐ రాంబాబు
సీతమ్మధార (విశాఖ ఉత్తరం) : ఆస్తి తగాదాలు, చిన్నచిన్న గొడవలు పెరిగి పెద్దవై హత్యకు దారి తీశాయి. సొంత చెల్లెలి భర్తే కిరాయి మనుషులతో బావమరిదిని హత్య చేసేందుకు రూ.5లక్షలకు ఒప్పందం కుదుర్చుకునేలా చేశాయి. నగరంలోని గాంధీనగర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన వంకల సింహాద్రి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. గతంలో ఉన్న ఆస్తి తగాదాల వల్లే సొంత చెల్లెలు భర్త పథకం ప్రకారం హత్య చేయించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మంగళవారం మధ్యాహ్నం ద్వారక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ పి.రామచంద్రరావు వెల్లడించారు.
గాంధీనగర్ ప్రాంతానికి చెందిన వంకల సింహాద్రి చాలా కాలంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆస్తి విషయంలో చెల్లెలి భర్త వీనుకొండ వీర వెంకట సురేష్తో తరచూ గొడవలు జరుగుతుండేవి. నిత్యం ఏదో ఒక విషయంపై సింహాద్రి మీద పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించేందుకు బావ ప్రయత్నించేవాడు. ఈ నేపథ్యంలో మార్చి నెల ప్రారంభంలో (హత్య జరగడానికి వారం రోజుల ముందు) జరిగిన కొట్లాటలో బావను సింహాద్రి కొట్టాడు. దీంతో పగ తీర్చుకోవడంతోపాటు ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని సురేష్ భావించాడు.
రూ.5 లక్షలకు ఒప్పందం
కొటక్ మహేంద్రలో బీమా మేనేజర్గా పనిచేస్తున్న సురేష్ తన వద్ద ఏజెంట్గా పనిచేస్తున్న కొల్లపల్లి జ్యోతి భాస్కర్ శ్రీధర్(20)కు జరిగిన కొట్లాట విషయం చెప్పి ఎలాగైనా సింహాద్రిని అంతమొందించాలని కోరారు. రాజమండ్రి ప్రాంతానికి చెందిన శ్రీధర్ ఉద్యోగరీత్యా ఏడాది కిందట నగరానికి వచ్చి మద్దిలపాలెం సమీపంలోని కృష్ణా కళాశాల వద్ద నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో ఉంటున్న తన స్నేహితుడు కాండ్రేగుల సాయిరాం (22) అలియాస్ చిరుతను సురేష్కు పరిచయం చేశాడు అనాథ అయిన సాయిరాం గతంలో చిన్నచిన్న నేరాలకు పాల్పడ్డాడు. సింహాద్రి హత్య చేసేందుకు వీరిరువురితో సురేష్ రూ.5లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం మంచి ఉద్యోగాలు ఇప్పస్తానని కూడా చెప్పారు.
తీవ్ర పెనుగులాట తర్వాత హత్య
ఈ నెల 9న గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో సింహాద్రి ఇంటికి శ్రీధర్, సాయిరాం వెళ్లి తలుపుకొట్టారు. సింహాద్రి తలుపు తీసిన వెంటనే ఇద్దరూ ఒక్కసారిగా దాడి చేశారు. అనూహ్య ఘటనతో బిత్తరపోయిన సింహాద్రి ప్రతిఘటించడంతో ఆ ప్రాంతంలోనే ఉన్న బీరువా, టీవీ అద్దం పగిలి ధ్వంసమయ్యాయి. అక్కడే లభించిన గాజు ముక్కతో సింహాద్రి గొంతులో సాయిరాం గుచ్చడంతో కుప్పకూలిపోయి మరణించాడు. హత్య జరిగిన తర్వాత నిందితులిద్దరూ చేతులు కడుక్కునేందుకు సురేష్ నీళ్లిచ్చి సత్యం జంక్షన్ వద్ద ఉండమని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి వెళ్లి వారిద్దరికీ తగిలిన గాయాలకు చికిత్స చేయించుకోమని రూ.15వేలు ఇచ్చాడు. మరసటి రోజు ఇసుకతోట దరి ఒక బార్ వద్దకు వెళ్లి ఇద్దరికీ రూ.30 వేలు ఇచ్చాడు.
మిస్టరీ ఛేదించిన పోలీసులు
హత్య జరిగిన రెండు రోజుల తర్వాత సింహాద్రి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికుల సమాచారంతో ఈ నెల 11న ద్వారక పోలీసులు రంగంలోకి దిగారు. ముందు నుంచీ ఆస్తి తగాదాలే హత్యకు దారితీసి ఉంటాయని భావించిన పోలీసులు మృతుడి బావ సురేష్ను అదుపులోకి తీసుకుని విచారించారు.అతడి ఫోన్కాల్స్ ఆధారంగా విచారణ చేపట్టి హత్య చేసిన ఇద్దరితోపాటు సురేష్ను అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరుస్తామని ఏసీపీ రామచంద్రరావు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన సీఐ, ఎస్ఐలు, సిబ్బందిని అయన అభినందించి రివార్డులు అందజేశారు. సమావేశంలో సీఐ రాంబాబు, ఎస్ఐలు బి.మురళి, కె.మధుసూదనరావు, అడపా సత్యారావు, ఏఎస్ఐ ఆనంద్, కానిస్టేబుళ్లు ఎన్.జ్యోతేశ్వరరావు, శంకర్, ఆగస్టిన్ పాల్గొన్నారు.
బావే సూత్రధారి
Published Wed, Mar 22 2017 2:06 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఎన్నికల వేళ.. చేపల చెరువు తవ్వకం
108 వాహనంలో ప్రసవం
15 నుంచి భీమవరంలో అతిరాత్ర మహాయాగం
Lok Sabha Election 2024: నాలుగో దశలో 67.70% పోలింగ్
పచ్చ ముఠాల విధ్వంస కాండ
ఓట్ల పండగకు సొంతూళ్లకు..
ఓటర్లూ.. ఈ నిబంధనలు పాటించండి
నేత్రపర్వం.. చాత్మార్ ఉత్సవం
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
ఓటు హక్కు.. వినియోగిద్దాం ఇలా..
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
- గన్నవరంలో టీడీపీ గలాటా
- పోలింగ్ సిబ్బంది ‘పచ్చ’పాతం
- Lok Sabha Election 2024: మహిళలకు ‘మహాలక్ష్మి’ గ్యారెంటీ: సోనియా
- నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత
- పల్నాట పచ్చ మూక బీభత్సకాండ
- వెచ్చని హృదయ రాగ సందేశం
- Lok Sabha Election 2024: రాయ్బరేలీ కోసం మేము.. అదానీ, అంబానీ కోసం మోదీ
- Lok Sabha Election 2024: నాలుగో దశలో 67.70% పోలింగ్
- Lok Sabha Election 2024: ఓటేస్తే ఉచిత బైక్ రైడ్
Advertisement